మళయాళ భామ అను ఇమ్మన్యుయెల్ టాలీవుడ్ కెరియర్ దాదాపు ముగిసిందని అనుకోవచ్చు. నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన మజ్ ను సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుయెల్ యువ హీరోలతో చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల సరసన ఛాన్స్ కొట్టేసింది. అయితే అమ్మడు చేసిన ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఆమెని ఐరన్ లెగ్ అనేశారు. అమ్మడు చేస్తున్న సినిమాలు ఏవి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అనుకి అవకాశాలు రాకుండా పోయాయి.

చాలా గ్యాప్ తర్వాత అను ఇమ్మాన్యుయెల్ కు తెలుగులో ఒకేసారి రెండు అవకాశాలు తలుపు తట్టాయి. అందులో ఒకటి అల్లు హీరో శిరీష్ చేస్తున్న ప్రేమ కాదంట కాగా మరోటి అజయ్ భూపతి డైరక్షన్ లో వస్తున్న మహా సముద్రం. ఈ రెండు సినిమాల్లో ప్రేమ కాదంట రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఈ సినిమా కోసం అను ఇమ్మాన్యుయెల్ గ్లామర్ డోస్ కూడా పెంచేసిందని టాక్. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయెల్ ల రొమాన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత అను ఇమ్మాన్యుయెల్ గ్రాఫ్ పెరుగుతుందని చెబుతున్నారు.

ఇదిలాఉంటే మరోపక్క మహా సముద్రంలో కూడా అనుకి మంచి పాత్ర పడ్డదని అంటున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ మహా సముద్రం. ఆ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ తో పాటుగా అదితి రావు హైదరి కూడా నటిస్తుంది. ఈ రెండు సినిమాల్లో ఒకటి హిట్ పడినా అను ఇమ్మాన్యుయెల్ తెలుగులో మళ్ళీ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బ్యాడ్ లక్ తోడైతే మాత్రం ఈసారి ఆమెకి ఛాన్సులు రావడం కష్టమని చెప్పొచ్చు. మొదట్లో అభినయం మీద దృష్టి పెట్టిన అను ఇప్పుడు స్కిన్ షోకి రెడీ అంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: