ఇక సితార కేవలం ఇన్ స్టాగ్రాంలోనే కాకుండా యూట్యూబ్లోనూ దుమ్ములేపుతుంటారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సితార యూట్యూబ్ చానెల్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో ఈ ఇద్దరు పిల్లలు కలిసి చేసే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆ మధ్య సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్స్లో భాగంగా తన తండ్రి సూపర్ స్టార్ మహేష్ బాబును ఈ ఇద్దరూ ఇంటర్వ్యూ కూడా చేసేశారు. అలా ఖాళీగా ఉండే సమయంలో సీతు పాప సోషల్ మీడియాలో బిజీగా అవుతుంటారు.
ఇక ప్రస్తుతం మళ్లీ ఆన్ లైన్ క్లాసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక దీంతో పిల్లలు మళ్లీ పుస్తకాలతో కుస్తీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పొద్దున్న పూట తనకు ఎండలో రెండు పనులు చేయడం ఇష్టమని, అందులో ఒకటి చదవడం, ఇంకొటి ఫోటోలు దిగడమని సీతు పాప చెప్పుకొచ్చారు.ఇక పొద్దున పూట తాను చదువుతున్నట్టుగా సితార షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది.సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఇక ఆన్ లైన్ క్లాసులతో తాను ఎంతగా బిజీగా వుందో చెబుతూ తన పెట్ ఫోటోను కూడా సితార నిన్న పోస్ట్ చేశారు.ప్రస్తుతం అది అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.