స్టార్ హీరోలు ప్రస్తుతం ఒక్కొక్కరు రెండేసి సినిమాలతో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా సెట్స్ మీద ఉండగా త్రివిక్రం డైరక్షన్ లో మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో మహేష్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇదే క్రమంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా తన వరుస సినిమాల ప్లానింగ్ తో ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ పూర్తి కాగానే కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు తారక్. ఆ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

రాం చరణ్ కూడా ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత శంకర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు టాక్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లు, మళయాళ రీమేక్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసి హరీష్ శంకర్ డైరక్షన్ లో సినిమా లైన్ లో పెట్టే ఆలోచనలో ఉన్నాడు.

ఇక మరోపక్క మెగాస్టార్ చిరంజీవి కూడా చేస్తున్న ఆచార్య పూర్తి కాగానే లూసిఫర్ రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. మోహన్ రాజా డైరక్షన్ లో రానున్న ఆ సినిమా తర్వాత వేదాళం రీమేక్ లో కూడా చిరు నటించనున్నాడు. ఆ సినిమాను మెహెర రమేష్ డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఈలోగా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో కూడా చిరంజీవిసినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే రాధే శ్యాం రిలీజ్ అవగానే సలార్, ఆదిపురుష్ రెండింటి మీద ఫోకస్ పెట్టనున్నాడు. ఈ రెండు సినిమాలు రెండు వేరు వేరు జానర్లు అందుకే ఒక షెడ్యూల్ ఒక సినిమాకు మరో షెడ్యూల్ మరో సినిమాకు టైం కేటాయిస్తున్నాడు. అల్లు అర్జున్ మాత్రమే పుష్ప రెండు పార్టుల పనుల్లో ఉన్నాడు. బాలకృష్ణ అఖండ తర్వాత గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమాకు సన్నద్ధం అవుతున్నాడు. నాగార్జున రైడ్ రీమేక్ తో పాటుగా బంగార్రాజు సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. వెంకటేష్ నారప్ప, ఎఫ్3, దృశ్యం 2 సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: