తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో బాలకృష్ణ ఒక్కరు. ఆయన నటించే సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. అయితే బాలయ్య వయస్సు ఎక్కువ కావడంతో యంగ్ హీరోయిన్లు, భారీగా క్రేజ్ ఉన్న హీరోయిన్లు ఆయనతో కలిసి నటించడానికి అంగీకరించడం లేదు ఆయన. ఇక సీనియర్ హీరోయిన్లు సైతం బాలయ్యకు నో చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం గమనార్హం అనే చెప్పాలి.

ఇక బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాలో టబు నటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత బాలయ్య నటించిన పాండు రంగడులో కూడా టబు నటించారు. ప్రేక్షకుల నుండి ఆదరణ పొందలేకపోతుంది. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం మేకర్స్ టబును సంప్రదించగా ఆమె నో చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే.

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా అఖండ మూవీ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారని సమాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమాలోని ఒక పాత్ర కోసం విలన్ పాత్రలతో గుర్తింపును సంపదించుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంపికైన సంగతి అందరికి తెలిసిందే. ఇక మరోవైపు ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి మరి.

అయితే మెయిన్ హీరోయిన్ల జాబితాలో శృతి హాసన్ తో పాటు మరి కొందరు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నా అధికారిక ప్రకటన రాలేదు. ఇక అఖండ సినిమాకు హీరోయిన్ల సమస్య ఎదురు కాగా బోయపాటి శ్రీను చివరకు ప్రేక్షకుల్లో ఏ మాత్రం క్రేజ్ లేని ప్రగ్యా జైస్వాల్, పూర్ణలను ఫైనలైజ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే బాలయ్య గోపీచంద్ మలినేని సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: