టాలీవుడ్ లో ఫీల్ గుడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ఆనంద్ ప్రేక్షకులను ఒక రకమైన ఫీల్ లోకి తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన చేసిన గోదావరి సినిమా ఫీల్ గుడ్ సినిమా లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచింది. ఇక కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన మరొక ఫీల్ గుడ్ సినిమా హ్యాపీ డేస్ ఆయనను స్టార్ డైరెక్టర్ గా మార్చింది. ఆ సినిమాలో పరిచయమైన నటీనటులు అందరూ ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద పెద్ద పొజిషన్ లో ఉండడం గమనార్హం.

ఇక పొలిటికల్ నేపథ్యంలో రానా దగ్గుబాటి ని హీరోగా పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కించిన లీడర్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.  లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా, ప్రస్తుతం చేస్తున్న లవ్ స్టోరీ వంటి సినిమాలు అన్ని ఎంతో ఫీల్ ఉన్న సినిమాలే.  అయితే స్టార్ డైరెక్టర్ అయ్యాక కూడా శేఖర్ కమ్ముల స్టార్ హీరోలతో కాకుండా కొత్త వారితోనే సినిమాలు చేయడం ఒక రకంగా ఆయన ఫ్యాన్స్ కు నిరాశ కు గురి చేసే విషయం. ఇదే ప్రశ్న ఒక సందర్భంలో ఆయనను అడుగుతే తాను స్టార్ హీరో ను డీల్ చేయలేనని, దానికంటే కొత్తవారితో సినిమా చేసి హిట్ కొట్టడం మంచిది అని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే తాజాగా ఆయన తమిళ స్టార్ హీరో ధనుష్ తో  సినిమా చేస్తుండడం ఆయన ఫ్యాన్స్ కి ఉత్సాహాన్నిచ్చే విషయమైనా సినీ విమర్శకులు మాత్రం ఆయన చెప్పిన మాటలను గుర్తు చేస్తూ విమర్శిస్తున్నారు. స్టార్ హీరోలతో సినిమా చేయలేనని చెప్పిన శేఖర్ కమ్ముల ఇప్పుడు ఎలా డీల్ చేస్తాడో అని ప్రశ్నలు సంధిస్తున్నారు అప్పటికీ ఇప్పటికీ శేఖర్ కమ్ముల ఎంతో పరిణితి చెంది ఉంటాడు.. తనకు స్టార్ హీరోలతో సినిమాలు చేయగలను అనే నమ్మకం వచ్చింది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాడు కాబోలు అని ఆయన అభిమానులు వారి ప్రశ్నలకు సమాధానాలు విసురుతున్నారు. తెలుగు తమిళ హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఆయన గత సినిమా లీడర్ సినిమా తరహాలోనే భారీ కాన్వాస్ లో ఈ సినిమా ఉండబోతుందట. ఇకపోతే ఆయన ఈ సినిమాలో మరో టాలీవుడ్ స్టార్ ను కూడా నటింప చేయబోతున్నాడట ఆయన వెంకటేష్ అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: