ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథతో ఈ సినిమా రాబోతుంది. రెండు పార్ట్స్ గా రాబోతున్న ఈ సినిమాలో మొదటి పార్ట్ పూర్తి అయింది. ఇక రెండో పార్ట్ షూటింగ్ కూడా మూవీ టీం త్వరలోనే పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

అయితే ఈ రెండు పార్ట్స్ కి విడుదల విషయంలో పెద్ద గ్యాప్ రానివ్వడు అంట సుక్కు. మొదటి పార్ట్ విడుదలైన 6 నెలలలోనే పుష్ప రెండోవ పార్ట్ వచ్చేస్తుంది అని టాక్. దీనికోసం ఆయన పార్ట్ 2 మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అని టాక్.ఎక్కువగా లేట్ అయితే ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది అని సుకుమార్ భావిస్తున్నారట. బాహుబలి కూడా రెండోవ పార్ట్ వచ్చే ఏడాది అని చెప్పి రెండు సంవత్సరాల తర్వాత విడుదల చేసారు. ఇక పుష్ప అలా అవుతుందో  లేదో వేచి చూడాలి.

ఇక విలన్‌‌గా నటిస్తున్న మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ కి అల్లు అర్జున్ మధ్య సన్నివేశాలని సుక్కు మొదలుపెట్టాలి అనుకున్న సమయంలోనే కరోన సెకెండ్‌‌ వేవ్ వల్ల షూటింగ్‌‌కి బ్రేక్ పడింది.  జులై నెలాఖరుకి షూటింగ్ ని మళ్ళీ మొదలుపెట్టాలి అని సుక్కు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ ని బట్టి చెప్పొచ్చు అభిమానులు బన్నీ సుక్కు కాంబినేషన్ లో సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో. ఈ టీజర్ కి టాలీవుడ్ లో ఎన్నడూ లేని విధంగా 70 మిలియన్స్ పైగా వ్యూస్ 1 మిలియన్ కి పైగా లైక్స్ రావడం నిజంగానే అందరిని వండర్ చేసింది.ఇక ఈ సినిమాలో బన్నీ కి జోడిగా నేషనల్ క్రష్ రష్మీక మందన్న నటిస్తుంది. ఇక సుకుమార్సినిమా త్వరగా పూర్తి చేసి విజయ్ దేవరకొండతో సినిమా మొదలుపెట్టాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: