పాన్ ఇండియా స్టార్ హీరో ధనుష్ విభిన్న కథలతో ఎప్పుడూ మన ముందుకు వస్తూ ఉంటారు. ధనుష్ ప్రతి సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. ఇక సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సినిమా మనకు తెలిసిందే. ఈ సినిమాకి ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు వర్క్ చేస్తుండడం గమనార్హం. నిన్నటి రోజున దివంగత సునీత జయంతి సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు. ఈ సినిమాని తెలుగు , తమిళ్, హిందీ లో నిర్మించనున్నారు. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి, తను ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నాను అంటూ హీరో ధనుష్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు..


వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావడంతో నిన్నటి రోజు నుంచి ఈ విషయం అన్నిచోట్ల చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సందర్భంగా హీరో ధనుష్ తన ట్విట్టర్ ద్వారా " డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నారాయణ దాస్, కె. నారంగ్-పుస్కర్ రామ్మోహన్ లతో కలిసి ఈ సినిమాకు పనిచేస్తున్నాను..అందుకు  నాకు చాలా థ్రిల్ గా ఉందని హీరో ధనుష్ చెప్పారు. నేను అభిమానించే దర్శకులలో ఒకరైన శేఖర్ కమ్ముల సార్ తో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

ఈ చిత్రం కోసం SVCLLP బ్యానర్ లో నారాయణ దాస్, రామ్మోహన్ రావు గారు ఈ బ్యానర్లో చేయడానికి కలిసినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను"అని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు ధనుష్. ధనుష్ మొట్టమొదటిసారిగా తెలుగులో  స్ట్రైల్ గా వస్తున్న సినిమా ఇది కావడం విశేషం. ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ చిత్రానికి వివిధ భాషలలో సంబంధించిన స్టార్ హీరోలు, టెక్నీషియన్ల బృందంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ భారీ ప్రాజెక్ట్ ఈ ఏడాది ఎప్పుడైనా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి  లేటెస్ట్ న్యూస్ వస్తే వెల్లడిస్తాను అని హీరో ధనుష్ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: