కొన్ని కొన్ని సార్లు సినిమా రిజల్ట్ కి అతీతంగా కొన్ని సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ ను సొంతం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్లాప్ అయిన కొన్ని సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యి అక్కడ హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. లేటెస్ట్ గా హిందీ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఓ ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరోనా తొలిదశ తర్వాత హిందీ లో రిలీజ్ అయిన మూవీస్ లో ఒకటి ముంబై సాగా.. ఇమ్రాన్ హష్మీ మరియు జాన్ అబ్రహం నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ సుమారు రెండు వందల స్క్రీన్స్ లలో రిలీజ్ అవగా ఈ సినిమా కి ప్లాప్ టాక్ వచ్చింది.
ఈ సినిమా 30 కోట్ల బడ్జెట్ తో రూపొందగా ఇది ప్లాప్ టాక్ తెచ్చుకొని రొటీన్ మాస్ మసాలా మూవీ గా 20 కోట్లు మాత్రమే వసూలు చేసి పది కోట్ల నష్టంతో బయటపడింది. ఈ కలెక్షన్స్ తో వసూళ్లను ముగించుకున్న ఈ సినిమా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి రావడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చడంతో తెలుగులో మీడియం రేంజ్ హీరోలతో చేస్తే బాగుంటుందని రీమేక్ రైట్స్ ని 50 లక్షలు చెల్లించి సొంతం చేసుకురట ఓ టాప్ ప్రొడ్యూసర్. మరి ఈ సినిమాలో హీరోలు ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. వీరిలో మెగా హీరో వరుణ్ తేజ్ ఉండబోతున్నారు అని మాత్రం తెలుస్తోంది. మరి రీమేక్ సినిమాలను చేంజ్ చేసి బాగా తీయడంలో మన దర్శకులు ఎంతో పండిపోయిన నేపథ్యంలో ఈ సినిమాను ఇక్కడ హిట్ సినిమాగా ఎలా మలుస్తారో చూడాలి.