దేశం లో కరోనా ఎండింగ్ దశకు వచ్చేసింది. మూడవ వేవ్ సంగతి పక్కన పెడితే రెండవ వేవ్ దాదాపు పూర్తి అయిందని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా షూటింగ్ లతో కళకళలాడుతుంది. స్టార్ హీరోలు ఆగిపోయిన తమ సినిమాలను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల ఆగిపోయిన సినిమాలు కొత్త రిలీజ్ డేట్స్ తో ముస్తాబు అవుతున్నాయి. అన్ని సినిమాల నిర్మాతలు తమ తమ సినిమాల అప్ డేట్స్ ను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు..   దీంతో త్వరలోనే థియేటర్లో ఓపెన్ అవుతాయో అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఏంటో ఒక లుక్కేద్దాం.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ తేజ్ లు కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం షూటింగ్ దశలోనే కరోనా కారణంగా ఆగిపోగా మళ్లీ మిగిలిన షూట్ ను చేయడానికి రాజమౌళి ఇప్పటికే సన్నాహాలు మొదలు పెడుతున్నారు. ఈ సినిమాతో పాటే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా కూడా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టుకోనుందట. ఇక మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న సర్కారు వారి పాట సినిమా కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా ఆ సినిమా కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు అని తెలుస్తోంది

ఇక ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా కొంత భాగం మాత్రమే ఉండడంతో దాన్ని పూర్తి చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న లైగర్ సినిమా ఇంకో షెడ్యూల్ మాత్రమే షూటింగ్ మిగిలి ఉందని తెలుస్తుంది. ఈ  సినిమా ని త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఆలోచన.  ఇక విడుదల కు సిద్ధంగా ఉన్న సినిమాలు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి.  చిరంజీవి ఆచార్య బాలకృష్ణ అఖండ వెంకటేష్ నారప్ప సినిమాలు కొత్త విడుదల తేదీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: