చార్మీ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఇక ఆమె ఇప్పుడు హీరోయిన్‌గా అవ‌కాశాలు త‌గ్గిపోవ‌డంతో నిర్మాత‌గా రాణిస్తోంది. అయితే ఆమె పెళ్లి విషయంపై మాత్రం ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంటుంది. అప్ప‌ట్లో మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ తో ల‌వ్‌లో ఉందని వీరిద్ద‌రూ త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నారంటూ పుకార్లు కూడా వ‌చ్చాయి. ఇక దీని త‌ర్వాత డ్యాషింగ్ డైరెక్టర్ అయిన పూరీ జగన్నాథ్ తో సన్నిహితంగా ఉంటోంది కాబ‌ట్టి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ ఇప్ప‌టికీ వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.

ఇక ఇదే క్ర‌మంలో రీసెంట్ గా చార్మీ తన సమీప బంధువుని మ్యారేజ్ చేసుకోనుందని వార్తలు వచ్చాయి. ఇక దీనిపై ఛార్మీ స్పందిస్తూ జీవితాంతం ఒంటరిగా ఉంటానని లేటెస్ట్ గా ప్ర‌క‌టించి అంద‌రికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం తాను లైఫ్ లో మంచి టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నాన‌ని, తాను ప్ర‌స్తుతం ఎంతో సంతోషంగా ఉన్న‌ట్టు తెలిపింది.

ఇక తాను లైఫ్ లో పెళ్లి చేసుకోవడమనే తప్పు అస్స‌లు చేయనని కుండ బద్దలు కొట్టింది ఈ హాట్ బ్యూటీ. అయితే ఛార్మీకి పెళ్లి పై ఇంతలా కోపం రావ‌డానికి గ‌ల కారణమేంటో అని అందరూ ఓ రేంజ్లో చర్చించుకున్నారు. కాగా ఛార్మీ సోలోగా ఉండిపోవాల‌ని నిర్ణయం తీసుకోవడానికి పూరీ ఇన్ ఫ్ల్యూయెన్సే కారణమంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక రీసెంట్ గా పూరీ మ్యూజింగ్స్ లో సింగిల్ బై ఛాయిస్ పాడ్ కాస్ట్ విన్న వారంతా కచ్చితంగా ఛార్మీ సోలోగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డానికి పూరీనే కార‌ణ‌మంటూ ఓ కొలిక్కి వ‌స్తున్నారు. దీంతో పూరీ మాట్లాడుతూ సినిమా హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుంటే తనకి అస్స‌లు నచ్చదని హీరోయిన్స్ ఎప్పుడూ దేవతలతో సమానమని స్టేట్ మెంట్ ఇచ్చాడు. వారు త‌మ శక్తిని ఈ దేశాన్ని మార్చడానికి ఉపయోగించాలని పూరీ మెసేజ్ కూడా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: