అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో సినిమా తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలని మాత్రమే ఒప్పుకుంటు వెళ్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమాని చేస్తున్నాడు. సుకుమార్  పుష్ప కథ ని మన టాలీవుడ్ బడ్జెట్ తో రాసుకుంటే బన్నీ దాన్ని ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా మార్చేశాడు.అయితే పుష్ప సినిమా తర్వాత బన్నీ కొరటాల శివ డైరెక్షన్ లో చేయబోతున్నారు.

ఆ సినిమాతో పాటుగా  దిల్ రాజు – వేణు శ్రీరామ్ ల ఐకాన్ మూవీ పై కూడా అల్లు అర్జున్  ఫోకస్ వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం ప్రకటించిన ఈ సినిమా ఇప్పటికి పట్టాలు ఎక్కబోతుంది అని టాక్. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనిలో ఉన్న  వేణు శ్రీరామ్ ఐకాన్ ని  పాన్ ఇండియా లెవల్ కి మార్పులు చెయ్యమని అల్లు అర్జున్ సూచనలు ఇచ్చినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.అయితే ఇన్నాళ్ళకి అయిన ఈ సినిమా పట్టాలు ఎక్కడంతో వేణు శ్రీరామ్ చాలా ఆనందంగా ఉన్నాడట. అసలు ఉంటుందా లేదా అనుకునే సినిమాకి బన్నీ కొత్త ఊపిరి ఇచ్చాడు అనే చెప్పాలి.

 ఎలాగో వరసగా భారీ బడ్జెట్ సినిమాల్ని నిర్మిస్తున్నా దిల్ రాజు కి ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో అంటే ఆనందమే అంట. ఇక ప్రస్తుతం ఈ సినిమా కథ మీద వేణు శ్రీరామ్ కూర్చోని పాన్ ఇండియా లెవెల్ లో మార్పులు చేస్తున్నారట. ఇప్పటికే వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా వల్ల ఆయన మీద ఇండస్ట్రీ చూపు అంత పడింది. అయితే వేణు శ్రీరామ్ ఇంకా దిల్ రాజు కాంపౌండ్ లోనే చేస్తారా లేక బయటకి వచ్చి మిగతా నిర్మాతలతో చేస్తారా అనేది ఇంకా తెలియట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: