మన దేశంలో కట్నం తీసుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి. చాలామంది కట్నం అనేది తీసుకుంటారు. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకూ చాలామంది కట్నాలు పొందిన వాళ్లే . కొన్ని కొన్ని కారణాల వల్ల రెండు రకాల వాదనలు ఈ కట్నం విషయం లో మనం వింటాం. ఆడవారి దగ్గర నుంచి కట్నం తీసుకోవడం నేరం అని భావిస్తుంటారు కొందరు. మాకు ఉన్న దాంట్లో కొంత భాగం అమ్మాయికి ఇస్తున్నామని వాదిస్తారు మరికొందరు. అలా ఈ పద్ధతి పై చాలా మంది చాలా రకాల అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. అందరిలాగానే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు కోట్ల రూపాయల కట్నాలు అందుకున్నారు.

అలా మరి మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నారో ఒకసారి తెలుసుకుందాం.. గంగోత్రి సినిమా ద్వారా తెలుగు తెరకు మీద అడుగు పెట్టిన అల్లు అర్జున్ తన భార్య స్నేహ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెను చేసుకునేందుకు అల్లు అర్జున్ స్నేహ  తండ్రి వద్ద సుమారు నాలుగు కోట్ల దాకా కట్నం తీసుకున్నారని అందులో పలు స్థిరచర ఆస్తులు ఉన్నాయని అంటారు. అల్లుఅర్జున్ మామ  కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకుడు. తెలంగాణలో కీలక వ్యక్తి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటారు. చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థలు చాలా ఉన్నాయి. కాలేజీలో గురించి చెప్తే పదుల సంఖ్యలో ఉన్నాయి..

అల్లు అర్జున్ అయన కాలేజీలకు డైరెక్టర్ గా ఉన్నారు. ఇదే సమయంలో స్నేహ రెడ్డి తో పరిచయం పెరిగింది. అది ప్రేమగా మారింది. తమ ప్రేమ విషయాన్ని ముందుగా తన తల్లికి చెప్పారు అల్లుఅర్జున్. తర్వాత కుటుంబ సభ్యులకు సైతం తమ ప్రేమను చెప్పి ఒప్పించారు. 2011లో వీధి ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్ళింది. 2014లో అల్లుఅర్జున్ మామ చంద్రశేఖర్రెడ్డి ఇబ్రహీంపట్నంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ టిఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు అయన. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇందులో లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నారు బన్నీ.

మరింత సమాచారం తెలుసుకోండి: