శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సింది కానీ ఈ లాక్డౌన్ వలన ఆ సినిమా రిలీజ్ లేట్ అయింది. అయితే ఆయన ఈ గ్యాప్ లోనే ఇంకో  ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ అధినేత పి రామ్మోహన్ రావు   స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఆఫీషల్ ప్రకటించారు.

సినిమా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది అదేంటి అంటే ఈ సినిమా కథని మొదట శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్ కి చెప్పాడట. అయితే ఆయన వచ్చే ఏడాది వరకు ఖాళీగా లేకపోవడంతో పవన్ ఈ సినిమా నుంచి వైదొలిగారు అని అయితే వెంటనే శేఖర్ కమ్ముల కథని ధనుష్ కి చెప్పడంతో ఆయన వెంటనే ఒప్పుకున్నారు.

అయితే ఈ కథ కూడా ఒక పక్క లవ్ స్టొరీ అని టాక్ వినిపిస్తుంది.అయితే ఈ విషయం తెలిసి పవన్ అభిమానులు కొంచెం డీలా పడ్డరు.శేఖర్ కమ్ముల కూడా పవన్ కళ్యాణ్ కి ఎప్పటినుంచో ఫ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలా ఒక ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేస్తే ఆ మూవీ కచ్చితంగా హిట్ అయ్యుండేది అని ఫాన్స్ కోరిక కానీ అది ఇప్పుడు నిరాశగా మారింది. ఇక  ధనుష్ నటించిన కొత్త సినిమా జగమే తందిరం నిన్ననే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి టాక్ మాత్రం అంత రేంజ్ లో లేదు. అలాగే ధనుష్ ప్రస్తుతం ది గ్రే మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయితే ఆయన రేంజ్ మారిపోతుంది. ఇప్పటికే ధనుష్ ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: