దేశంలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతోంది.ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ లకు పర్మిషన్స్ కూడా ఇస్తున్నాయి ప్రభుత్వాలు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని పూర్తిగా ఎత్తేయడంతో దర్శక నిర్మాతలు మళ్ళీ షూటింగ్ లకు సిద్ధం అవుతున్నారు. అటు స్టార్ హీరోలు సైతం తమ డేట్స్ ని అడ్జెస్ట్ చేసుకునే పనిలో పడ్డారు.ఇక ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం అయ్యప్పనున్ కోషియం రీమేక్ షూటింగ్ ని స్టార్ట్ చేయమని దర్శకుడు సాగర్ చంద్ర కి పవన్ చెప్పినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ అంతా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరిగింది.

ఇప్పుడు కూడా మళ్లీ అక్కడే తిరిగి షూటింగ్ పునఃప్రారంభినచనున్నారట.అక్కడ వేసిన పోలీస్ స్టేషన్ సెట్ లో కొన్ని సీన్లు షూట్ చేయనున్నారు.జులై రెండవ వారం నుంచి ఈ షూటింగ్ ఉండబోతోంది.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ల కలయిక లో వస్తున్న మల్టీస్టారర్ సినిమా ఇది.ఇక మలయాళంలో హిట్టయిన అయ్యప్పనున్ కోషియం అనే సినిమాకి రిమేక్ తెరకెక్కుతుంది. 'అప్పట్లో ఒకడుండేవాడు' మూవీ ఫేమ్ సాగర్. కె. చంద్ర ఈ రీమేక్ కి దర్శకత్వం వహిస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్ బబ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ భారీ మల్టీస్టారర్ ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ రీఎంట్రీ ఇచ్చిన పవన్.. రానున్న రోజుల్లో మరికొన్ని సినిమాలతో బిజీగా మారనున్నాడు. ఈ సినిమాతో పాటుగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న పవన్.. ఈ రెండు ప్రాజెక్ట్ లను ఒకేసారి పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారట.అందుకే వీలైనంత త్వరగా ఈ సినిమాలను పూర్తి చేసి.. తర్వాతి ప్రాజెక్ట్ లపై దృష్టి సారించాలని పవన్ అనుకుంటున్నాడట.ఇక ఈ రీమేక్ లో పవన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ రీమేక్ ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: