మహేష్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు కొరటాల తీసిన ఈ సినిమా రిలీజ్ అనంతరం అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక మూవీ లో మహేష్, శృతి ల జోడీకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట మూవీ చేస్తోన్న సూపర్ స్టార్ మహేష్, దాని అనంతరం త్రివిక్రమ్ తో ఒక భారీ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థపై ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మితం కానున్న ఈ సినిమా పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు టాక్.
అలానే ఈ మూవీ లో మహేష్ పాత్ర ఎంతో అద్భుతంగా డిజైన్ చేసారట దర్శకుడు త్రివిక్రమ్. ఇక అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో మహేష్ కు జోడీగా శృతి హాసన్ ని ఎంపికచేశారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. వాస్తవానికి పలువురు ఇతర హీరోయిన్స్ ని కూడా పరిశీలించిన దర్శకుడు త్రివిక్రమ్ ఫైనల్ గా శృతి అయితేనే ఈ పాత్రకు సరిపోతుందని భావించి ఆమెను ఎంపిక చేసారని, అలానే ఇటీవల ఆమెను కలిసి కథ, కథనాలు వినిపించడంతో పాటు ఆమె నుండి కాల్షీట్స్ కూడా తీసుకున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే మరొక్కసారి స్క్రీన్ పై మహేష్, శృతి ల జోడీని చూడవచ్చన్నమాట .... !!