పాన్ ఇండియా హీరో ప్రభాస్.. వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ హీరో చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ప్రభాస్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులే అవుతుంది. ఇక ప్రభాస్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా 'రాధే శ్యామ్'.. దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాలో డార్లింగ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 1920ల కాలంలో ఇటలీ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.

 సినిమాలో ప్రభాస్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. ఇటీవలే దానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది.ఇక ఈ సినిమాని జులై30 న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.కానీ కరోనా వల్ల విడుదల వాయిదా పడింది.ఇక ఇదిలా ఉంటె ఈ సినిమా అప్డేట్స్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుందని అనుకున్నా.. చిత్ర యూనిట్ మాత్రం వారికి నిరాశనే మిగిల్చింది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చాడు కమెడియన్ ప్రియదర్శి.ఈ సినిమా పేరుకు వింటేజ్ లవ్ స్టొరీనే అయినా..సినిమాలో హ్యూమర్ కూడా కాస్త ఎక్కువేనట.ఇక సినిమాలో లవ్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ కి అడ్డుపడే క్యారెక్టర్ లో నటిస్తున్నారట.అయితే ఇందులో తన కంటే ప్రభాస్ చాలా బెటర్ కామెడీని పండించాడని ఓ హింట్ ఇచ్చాడు.అంటే మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ సినిమాల కాలం నాటి ప్రభాస్.. మళ్ళీ చాలా కాలం తర్వాత రాధే శ్యామ్ తో మంచి హ్యూమర్ ని పండించడానికి రెడీ అయ్యాడన్న మాట.మరి ప్రభాస్ ఏ రేంజ్ లో కామెడి పండించాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: