టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సర్కారు వారి పాట. యువ సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలై సినిమా పై అందరిలో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై నిర్మితం అవుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక వడ్డీ వ్యాపారి పాత్రలో కనిపించనుండగా కీర్తి బ్యాంక్ ఎంప్లాయ్ పాత్ర పోషిస్తున్నట్లు టాక్.

మంచి మెసేజ్ తో కూడిన మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని దర్శకుడు పరశురామ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో ఎంతో గ్రాండ్ గా జరుగగా, రెండవ షెడ్యూల్ ని కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ లో ప్రారంభించారు. అయితే హఠాత్తుగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూట్ ని నిలుపుదల చేయడం జరిగింది. ఇక అప్పటి నుండి తన ఫ్యామిలీ తో కలిసి ఇంట్లోనే  ఉంటున్న సూపర్ స్టార్ ఇటీవల కరోనా వాక్సిన్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. అయితే సర్కారు వారి పాట మూవీ కి సంబంధించి లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఈ మూవీ షూటింగ్ జులై మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు టాక్.

ఇక ఇప్పటికే మూవీ యూనిట్ లోని సభ్యులు అందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ ని పక్కాగా ముందుకు నడిపించనున్నారని అంటున్నారు. అలానే అన్ని అనుకున్నట్లు జరిగితే మూవీని ముందు అనుకున్న ప్రకారమే 2022 జనవరిలో విడుదల చేయాలని యూనిట్ యోచన చేస్తోందట. ఇక షూట్ మొదలైన దగ్గరి నుండి అప్ డేట్స్ కూడా వరుసగా రానున్నాయని సమాచారం రావడంతో సర్కారు వారి పాట పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో మరింతగా ఆసక్తి మొదలైంది .... !!

మరింత సమాచారం తెలుసుకోండి: