యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా రాధే శ్యామ్. సాహో లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఈ సినిమాను ప్రభాస్ ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తవగా కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. అయితే ఏ ముహూర్తంలో ఈ సినిమా మొదలు పెట్టారో తెలియదు కానీ ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు ఆలస్యమవుతూనే వస్తున్నాయి. సినిమా రిలీజ్ మొదలు సినిమా అప్డేట్స్ వరకు దాదాపు అన్ని విషయాలు ఆలస్యమవుతూనే వస్తుండడంతో ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కి అసంతృప్తి పెరిగిపోతోంది. 

అయితే తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కు కాస్త ఊరట కలిగించే విషయాన్ని ఈ సినిమా టెక్నీషియన్ ఒకరు హింట్ ఇచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న కారణంగా బాలీవుడ్ లో ఇద్దరు సంగీతదర్శకులు అలాగే సౌత్ లో అన్ని భాషల్లో కలిపి మరో సంగీత దర్శకుడిని మేకర్స్ నియమించారు. బాలీవుడ్ లో అయితే ఈ సినిమా కోసం ఇద్దరు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. మిధున్ అలాగే మనన్ భరద్వాజ్ ఇద్దరూ కలిసి రాధేశ్యాం హిందీ సినిమాకు సంగీతం అందిస్తుండగా అందులో మిథున్ రెండు పాటలు కంపోజ్ చేస్తున్నారు.

ఇక మనన్ కూడా ఒక పాటకు సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనన్ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఆనందం వ్యక్తం చేసేలా ఉంది. ''కలలు నిజమవుతాయని, మనల్ని ఎమోషనల్ చేస్తాయని అని ఆయన చెప్పుకొచ్చారు.. రాధేశ్యామ్ వచ్చేస్తోంది, నన్ను నేను గిల్లి చూసుకున్నాను ఇది నిజమా కాదా అని అంటూ ఆ బిగ్ డే కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఆయన హింట్ ఇచ్చారు. అయితే బహుశా ఇది ఫస్ట్ సింగిల్ కోసం అని ప్రచారం జరుగుతుండగా అసలు విషయం ఏమిటి అనేదానిమీద సస్పెన్స్ కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: