ఇండస్ట్రీకి చాలా మంది నటులు పరిచయం అవుతుంటారు. కానీ అందరికి గుర్తింపు లభించదు.. కొందరికి ఒక్క సినిమాతోనే గుర్తింపు లభిస్తే.. మరికొందరికి ఏళ్ల తరబడి పని చేసిన గుర్తింపు దక్కదు. అలాంటి వారిలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఒక్కరు. ఆమె ఇండస్ట్రీకి ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం అడుగు పెట్టింది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఆమె కథానాయికగా రాణించినా… తర్వాతర్వాత ఆమె ప్రతినాయిక ఛాయలున్న పాత్రలు చేయడం మొదలు పెట్టారు.

ఇక ఆమె కేవలం హీరోయిన్‌ పాత్రలు మాత్రమే కాకుండా… మంచి పాత్ర అంటే విలన్‌ అవ్వడానికీ రెడీ అయ్యింది. ఆలా ఆమె తమిళ్ చిత్ర పరిశ్రమలో లేడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఇక ఇప్పుడు ఆమె వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా మారిపోయింది. వరలక్ష్మి సందీప్ కిషన్ హీరోగా నటించిన తెనాలి రామకృష్ణ’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ఆశించినంతగా ఫలితం ఇవ్వలేకపోయింది.

కానీ.. ఈ అమ్మడు మన దర్శకుల దృష్టిలో పడింది. ఆ తరువాత ఆమె రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె యాసకి, కటౌట్‌కి ఫ్యాన్స్‌ ‘రీసెంట్‌ బెస్ట్‌ లేడీ విలన్‌’ అనేంతగా ఆ పాత్రకు సెట్‌ అయ్యింది. ఇక విలన్ గానే కాకుండా.. అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాలో లాయర్‌ పాత్రలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ రాణించింది.

ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయని సమాచారం. గోపీచంద్‌ మలినేని నందమూరి బాలకృష్ణ కాంబో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వరలక్ష్మిని తీసుకున్నారని ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో వరలక్ష్మి విలన్ పాత్రలో నటిస్తున్నారంట. అలాగే ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న ‘హను మాన్‌ ’ సినిమాలోనూ వరలక్ష్మిని తీసుకున్నారట. ఇవేకాకుండా మరో రెండు సినిమాల చర్చలు తుది దశకు వచ్చాయని సమాచారం. ఇక ఆ సిన్ సినిమాలో ఎలా కనిపిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: