నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల లోనే టాప్ హీరో గా ఉన్నారు. మొదటినుంచి తన వైవిధ్యమైన నటనతో, హావభావాలతో, డైలాగ్ డెలివరీతో ప్రత్యేకమైన అభిమానాన్ని ప్రేక్షకులలో ఏర్పరుచుకున్నారు, తన అభిమానులనే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా బాలకృష్ణ ఎంతగానో అలరిస్తాడు. ఆయన సినిమాలు ప్రతి ఒక్కరు చూడటానికి కారణం ఆయన సింప్లిసిటీ. రాజకీయాల్లో, సినిమాల్లో ఆయనకు తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకొప్తున్నారు.

ఇక బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే  సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయింది. త్వరలోనే ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించుకుంతుందని  తెలుస్తోంది. బాలకృష్ణ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో బాలయ్య బాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వస్తుంది.

నిజానికి బాలకృష్ణ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో కావాల్సి ఉంది. తండ్రి ఎన్టీఆర్ మాదిరిగా బాలయ్య కూడా జానపద పౌరాణిక చిత్రాల్లో నటించి వైవిధ్యమైన పాత్రల తో మెప్పించారు.  రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ సినిమా హిందీలో డబ్ చేసి ముంబైలో విడుదల చేయగా అక్కడ ఈ సినిమా రికార్డులు సృష్టించింది అయితే ఈ సమయంలోనే ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని చూశారు. దాని కోసం మంచి క్యాస్టన్గ్ కూడా సెట్ చేశారు. పాపులర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కోసం ట్రై చేశారు అయితే ఈ సినిమాకు డైరెక్ట్ చేయబోయే డైరెక్టర్ గా ఎన్ చంద్రయ్య సెలక్ట్ చేయగా ఆయన బిజీ అవడం, మాధురి దీక్షిత్ కు కూడా మంచి క్రేజ్ వచ్చి దొరక్కపోవడంతో హోల్డ్ లో పడిపోయింది సినిమా.. అలా  బాలకృష్ణ బాలీవుడ్ ఎంట్రీ ఆగిపోయింది.. తర్వాత తర్వాత బాలయ్య కూడా బాలీవుడ్ కు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: