దివంగత నటి సౌందర్య ను, ఆమె నటించిన సినిమాలను ఆమె ను అభిమానించే వారు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆమె సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో నటించి తెలుగుదనం ఉట్టిపడేలా చేస్తుంది సౌందర్య. ఆమె లేరనే వార్త ఇప్పటికీ ఆమె అభిమానులు నమ్మలేకపోతున్నారు. ప్రమాదవశాత్తు ఆమె విమాన ప్రమాదంలో చనిపోగా ఆమె చనిపోయిన కొన్ని రోజుల వరకూ ఆమె అభిమానులు ఆమె మరణాన్ని తట్టుకోలేక పోయారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటన అంటే ఇలా ఉండాలి అని ముద్ర వేసిన హీరోయిన్ సౌందర్య. అందానికి అందం అభినయం కలగలిసినట్లుగా ఉండే సౌందర్య తో నటించాలని అప్పట్లో హీరోలందరూ క్యూ లు కట్టేవారు.

సౌందర్య ఉంటే సినిమా హిట్ అనే భావన నిర్మాతల్లో నెలకొనడంతో సౌందర్య మంచి డిమాండ్ నెలకొంది. మనవరాలి పెళ్లి అనే సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా ద్వారా ఆమెకు మంచి గుర్తింపు దక్కించుకుంది ఆ తరువాత పెద్దపెద్ద హీరోలందరితో హీరోయిన్ గా చేసి చాలా మంచి పేరు సంపాదించుకుంది. సౌందర్య కు వచ్చిన పారితోషకం తో ఆమె ఎన్నో ఆస్తిపాస్తులు సంపాదించుకుంది. వాటిలో ఆమె బెంగుళూరులో బంగ్లా కూడా కొన్నది..  ఇకపోతే ఆమె  గురించి ఎంతో బాగా చెబుతూ ఉంటారు తోటి నటీనటులు..

ఇటీవలే చావు కబురు చల్లగా సినిమాలో నటించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన బెస్ట్ ఫ్రెండ్ అయినా సౌందర్య గురించి పలు విషయాలను చెప్పుకున్నారు. సౌందర్య నేను కాకుండా ఇంకా ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉండి ఉండొచ్చని నాకు మాత్రం సౌందర్య బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. పెళ్లి అయిన తర్వాత కూడా సౌందర్య తో అప్పుడప్పుడు మాట్లాడేదాన్నని చెప్పింది. సౌందర్య చనిపోయిన వార్తలు నమ్మలేదు కానీ నిజంగానే ఆమె చనిపోయిందని దానికి  స్థాణువయ్యాను అని వెల్లడించింది. ఒకసారి నేను సౌందర్య అమ్మ గారిని చూడడానికి వారి ఇంటికి వెళ్లాలని అనుకున్నాను.. వారి ఫోన్ నెంబర్ తన దగ్గర లేకపోవడంతో నేరుగా ఇంటికి వెళ్లాను అన్నారు అన్నారు. అయితే ఆ ఇల్లు ఇప్పుడు బూతు బంగ్లా మారిపోయిందని అక్కడ ఎవరూ లేరని బాధపడ్డారు.  ఆ తరువాత అక్కడ వారిని అడిగితే అక్కడ ఎవరూ ఉండటం లేదని షిఫ్ట్ అయిపోయారు అని ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదని చెప్పారు. అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: