టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..తన అందంతో సౌత్ ఇండియన్ ప్రేక్షకులను కొన్నేళ్లుగా అలరిస్తోంది ఈ బ్యూటీ హీరోయిన్. ఇక మూడు పదుల వయసులో కూడా మత్తెక్కించే శరీరాకృతితో హల్చల్ చేస్తూ వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇక పదేళ్ల క్రింద ఎంత నాజూకుగా ఉందో ఇప్పుడు కూడా అంతే నాజూకుగా ఉండి మిల మిల మెరిసే అందంతో యూత్ కి పిచ్చెక్కిస్తూ ప్రతి ఒక్కరిని చేస్తోంది.ఇక ఈ నేపథ్యంలో తాజాగా తన గ్లామర్ సీక్రెట్ బయటపెడుతూ మరో షాకింగ్ విషయం చెప్పింది మిల్కీ బ్యూటీ తమన్నా.మాములుగా వయసులో వున్నప్పుడు ముఖం మీద మొటిమలు రావడం అనేది ప్రతిఒక్కరికీ సాధారణ విషయమే.అయితే ఇక ఈ మొటిమలు తగ్గించుకొని నునుపైన ముఖ సౌందర్యంతో కనిపించాలనేది అందరికీ ఉండే మామూలు కోరిక. అయితే ఇందుకోసం ముఖానికి క్రీములు రాయడం,అలాగే విలువైన కాస్టోటిక్స్‌ వాడటం, ఇంకా ట్రీట్‌మెంట్ తీసుకోవడం.. ఇలాంటి తెగ ప్రయత్నాలు చేస్తుంటారు జనం.

 అయితే మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం ఆ మొటిమలు నివారించేందుకు ఉమ్మి వాడుతుందట. ఇదేంటి? చాలా విడ్డూరంగా ఉందే.. అని అనుకుంటున్నారు కదూ!. అలా అనిపించడం సహజమే కానీ ఈ విషయాన్ని మన మిల్కీ బ్యూటీ తమన్నానే స్వయంగా చెప్పడం అసలు ట్విస్ట్.అయితే ఓ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తమన్నాని మీరు మీ ముఖ సౌందర్యం కోసం వేసుకునే స్పెషల్ ఫేస్ ప్యాక్ ఏంటి అని ప్రశ్న వేయగా, ఇక తమన్నా క్రేజీ ఆన్సర్ ఇచ్చింది.తను ఉదయాన్నే లేచిన వెంటనే తన లాలాజాలం (సలైవా)ను ముఖానికి అప్లై చేస్తానని చెప్పి తమన్నా షాకిచ్చింది. ఇక అంతేకాదు సలైవా స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడంలో బాగా పని చేస్తుందని కూడా తమన్నా చెప్పుకొచ్చింది. ఇక తమన్నా చెప్పిన ఈ బ్యూటీ సీక్రెట్ విని ఫ్యాన్స్ అంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: