సౌత్ సినీ స్టార్స్ లో కోలీవుడ్ హీరో ధనుష్ కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే.విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న ఈ హీరో.. రోజు రోజుకి తన క్రేజ్ ని పెంచుకుంటూ సౌత్ లో తన సత్తా చాటుతున్నాడు.ముఖ్యంగా ఇటీవల ధనుష్ నటించిన 'అసురన్', 'కర్ణన్' వంటి సినిమాలు ధనుష్ స్థాయిని అమాంతం పెంచేసాయి.ఇక రీసెంట్ గా ఈ హీరో నటించిన 'జగమే తంత్రం' సినిమా విడుదలై ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందనను రాబట్టింది.ఇక ఇప్పుడు ధనుష్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరిపోయింది.హాలీవుడ్ లో తెరకెక్కుతున్న 'ది గ్రే మ్యాన్' అనే సినిమాలో ధనుష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అలాగే టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఇక ఇదిలా వుండగా తాజాగా ధనుష్ మరో అరుదైన ఘనతని సాధించాడు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ధనుష్ ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య 10 మిలియన్లకు చేరింది.సౌత్ ఇండియా మొత్తం లోనే ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉంది ఒక్క మన మహేష్ బాబు కి మాత్రమే.ట్విట్టర్ లో మహేష్ ని ఫాలో అయ్యేవారి సంఖ్య 11 మిలియన్లకు చేరింది.అంటే దీని ప్రకారం మహేష్ తరువాత స్థానంలో తమిళ హీరో ధనుష్ నిలిచాడు.ఇక ట్విట్టర్ లో ఈ రేంజ్ ఫాలోవర్స్ ఉన్న సౌత్ యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు.

మరి ఫ్యూచర్ లో మహేష్ ని బీట్ చేసి ధనుష్ నంబర్ వన్ స్థానానికి చేరుకుంటాడేమో చూడాలి.ప్రస్తుతం ధనుష్ తమిళంలో కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.పప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నాడు ధనుష్. ఈ సినిమా తెలుగుతో పాటూ తమిళంలో కూడా తెరకెక్కనుంది.ఇక ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇక ఈ సినిమాకి ధనుష్ భారీ రెమ్యునరేషన్ కూడా తీసుకుబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: