అల వైకుంఠపురములో తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు త్రివిక్రం శ్రీనివాస్. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసుకుంటుందని చెబుతున్నారు. మహేష్ సర్కారు వారి పాట సినిమా అలా షూటింగ్ పూర్తి కాగానే త్రివిక్రం సినిమా ఇలా సెట్స్ మీదకు వెళ్లేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. మహేష్, త్రివిక్రం కలిసి చేస్తున్న 3వ సినిమాగా హ్యాట్రిక్ కాంబో భారీ అంచనాలు ఏర్పరచుకుంది. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రం ఎవరు ఊహించని కాంబో ఫిక్స్ చేసినట్టు టాక్.

త్రివిక్రం సినిమా అంటే నిర్మించే బ్యానర్ ఒకటే అదే హారిక హాసిని బ్యానర్. రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మాతగా త్రివిక్రం సినిమాలు ఉంటాయి. హీరో మారొచ్చేమో కాని త్రివిక్రం డైరక్షన్ లో సినిమా అంటే నిర్మాత మాత్రం ఆయన ఫిక్స్. అయితే లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య బాబు హారిక హాసిని బ్యానర్ లో తన సినీమ ఉంటుందని కన్ ఫర్మ్ చేశారు. ఆ బ్యానర్ లో సినిమా అంటే దాదాపు త్రివిక్రం డైరక్టర్ గా ఫిక్స్ అన్నట్టే. డైరెక్ట్ గా త్రివిక్రం తో సినిమా అని చెప్పకుండా బాలయ్య ఇలా హింట్ ఇచ్చాడా అని నందమూరి ఫ్యాన్స్ ఎక్సయిట్ అవుతున్నారు.

ఒకవేళ నిజంగానే త్రివిక్రం, బాలకృష్ణ కాంబో ఫిక్స్ అయితే ఎలాంటి సినిమా వస్తుంది అంటూ ఇప్పటి నుండే అంచనాలు పెంచేస్తున్నారు. తన మాటల తూటాలతో సాధారణ సన్నివేశాన్ని బలంగా మార్చే త్రివిక్రం బాలయ్య లాంటి పవర్ ఫుల్ మాస్ హీరోతో సినిమా అంటే రికార్డులు తిరగ రాయడం కన్ ఫర్మ్ అని చెప్పొచ్చు. కచ్చితంగా ఈ కాంబో సెట్ అయితే ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి బాలకృష్ణ, త్రివిక్రం కలిసి పనిచేసే ఛాన్సులు ఏమేరకు ఉన్నాయో త్వరలో తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: