టాలీవుడ్ లో ప్రస్తుతం యువ హీరోలు వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తమ క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటివరకు ఎంతోమంది యువ హీరోలు తమ తమ సినిమాలతో సత్తాచాటి స్టార్ హీరోలు గా మారడానికి దూసుకుపోతున్నారు. సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. నవీన్ పోలిశెట్టి, కిరణ్ అబ్బవరం, సంతోష్ శోభన్ లాంటి హీరోలు భవిష్యత్ స్టార్ హీరోలని పేర్కొంటున్న నేపథ్యంలో వీరు సినీ విశ్లేషకుల అంచనాలు ఏ మాత్రం అందుకుంటారో చూడాలి.

ఇక ఇటీవలే జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకొని క్రేజీ హీరోల లిస్టులో చేరిపోయాడు నవీన్ పోలిశెట్టి. మొదట్లో సైడ్ పాత్రలు చేసుకుంటూ వచ్చి బాలీవుడ్ లో మంచి అవకాశాలు పొంది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా మారాడు నవీన్ పోలిశెట్టి. హీరోగా చేసిన తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఆయన స్పెషల్ హీరో అని అందరూ గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నవీన్ పోలిశెట్టి నుంచి తదుపరి సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూశారు. వారి ఎదురు చూపులకు ఫలితంగా జాతి రత్నాలు సినిమా వచ్చి ప్రేక్షకులను ఎంతగానో మేప్పించింది. 

సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఆయనకు టాలీవుడ్ లో గతంలో ఎప్పుడూ లేని క్రేజ్ దక్కింది. దాంతో ఆయన చేయబోయే తదుపరి సినిమా గురించి ఇప్పటి నుంచి ఆరా తీయడం మొదలు పెట్టారు అనుష్క హీరోయిన్ గా నవీన్ పోలిశెట్టి హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి అంతేకాదు జాతిరత్నాలు సినిమా విడుదలైన తర్వాత నవీన్ పోలిశెట్టి కి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వచ్చాయని, పెద్ద దర్శకులు సైతం ఆయనతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారని , ఇప్పటికే ఆయన ఓ అరడజను సినిమాలు ఒప్పుకొని షూటింగ్ కి సిద్ధంగా ఉన్నాడని వార్తలు వచ్చాయి కానీ ఈ సినిమా తర్వాత ఆయన ఇప్పటివరకు తన తదుపరి సినిమా అనౌన్స్ చేయలేదు. అలాగే అనుష్కతో చేసే సినిమా క్యాన్సిల్ అయ్యింది అని కూడా అంటున్నారు దానిపై కూడా ఆయన ఇంత వరకూ నోరు మెదపలేదు. ఈ నేపథ్యంలో నవీన్ పోలిశెట్టి కి హిట్టు దక్కిన తర్వాత కూడా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: