ఆది పినిశెట్టి.. చూడటానికి హీరోలా కనిపిస్తున్నాడు. ఆ రూట్ లో వెళ్లాల్సింది పోయి మరో రూట్ లో వెళ్లుతున్నాడు. ఎక్కువగా విలన్ క్యారెక్టర్లతోనే సరిపెట్టుకుంటున్నాడు. సరైనోడు సినిమాలో తాను ఏంటో నిరూపించుకున్నాడు. ఈ సారి రామ్ ను ఎదుర్కొనే సాహసవంతమైన పాత్రను సెలక్ట్ చేసుకున్నాడు.

ఆదిపినిశెట్టి మొదటి నుంచి తనకు నచ్చిన పాత్రలనే తీసుకుని ముందుకు అడుగులు వేస్తున్నాడు.ఈ ప్రాసెస్ లో ఫెయిల్యూర్స్ వచ్చినా నటుడిగా ఏనాడు ఫెయిల్ కాలేదు. ఆ కారణంతోనే అవకాశాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. టాలీవుడ్, కోలీవుడ్ లలో ప్యార్లల్ గా చిత్రాలు చేస్తూ ఉన్నాడు.

తాజాగా లింగుస్వామి , రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం... తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం లో ఇప్పటికే ప్రముఖ నటి నదియా కూడా నటిస్తుంది. అయితే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో మరొక ఫేమస్ నటుడు నటిస్తున్నాడు. అతగాడు ఎవరో కాదు ... ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి. ఇప్పటికే సరైనోడులో నెగిటివ్ రోల్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.రంగస్థలంలో చెర్రీకి అన్నయ్య పాత్ర చేసి అక్కడ తన టాలెంట్ చూపించుకున్నాడు.

ఆది ఈ సారి రామ్ కు విలన్ గా నటిస్తున్నాడు. లింగుస్వామి సినిమాలలో విలన్ కుండే ఇంపార్టెన్స్ తెలిసిందే. హీరోకు ధీటుగా విలన్ ను ఎలివేషన్ షాట్స్ లో హైలెట్ చేస్తూ ఉంటాడు. దీనికి తోడు ఆదికి ఇప్పటికే కోలీవుడ్ మార్కెట్ ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ సినిమాకు హైలెట్ కాబోతున్నాయి.అంతేకాదు ఆది అంటే ఏంటో తెలుగు  ఆడియన్స్ కు మరోసారి చూపించే అవకాశం దొరికింది.అలాగే తాను నటించిన పలు తమిళ చిత్రాలను డిజిటర్ రైట్స్ రూపంలో ఎక్కువ రేటుకు అమ్ముకోవాలన్నా ఇలాంటి ప్రెస్టీజియస్ చిత్రాలలో కనిపించడం కంపల్సరీ.మరి ఈ అవకాశం ఆది ఎంతవరకు ఉపయోగించుకొని తన ఫ్యూచర్ తెలుగు ప్రాజెక్ట్ లను సెట్స్ మీదకు తీసుకుపోతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: