అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి 'ఉప్పెన' ఈ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమా విడుదల కాకముందే  'ఉప్పెన' సినిమా నుండి వచ్చిన పాటలు, పోస్టర్లు, టీజర్ల ద్వారా ఈ హీరోయిన్ సూపర్ క్రేజ్ ని తెచ్చుకొని యూత్ డ్రీమ్ గర్ల్ గా మారింది. సినిమా విడుదల తర్వాత బేబమ్మ నటన అభినయం చూసి ఫిదా అయిపోయిన ప్రొడ్యూసర్లు , హీరోలు తమ సినిమాలో హీరోయిన్ గా చేయమంటూ ఈ హీరోయిన్ వెంట పడ్డారు. ఈ ముద్దుగుమ్మ కూడా తనకు సరిపోయే కొన్ని కథలను చూసి ఓకే కూడా చెప్పేసింది.


 నాని హీరోగా నటిస్తున్న 'శ్యామ్ సింగరాయ' సినిమా తో పాటు, సుధీర్ బాబు హీరోగా ఒక సినిమా, రామ్ పోతినేని సరసన కూడా ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పింది, ఈ సినిమాలో రామ్ ఒక పవర్ ఫుల్ హీరోగా కనిపించనున్నట్లు తెలుస్తోంది .ఇలా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ హీరోయిన్ కి నాగార్జున హీరోగా నటిస్తున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'బంగార్రాజు' సినిమాలో నాగార్జున తో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నట్లు అయితే ఈ హీరో పక్కన ఒక హీరోయిన్ అవసరం ఉండటంతో కృతి శెట్టి ని దర్శక నిర్మాతలు సంప్రదించినట్లు ఆమె ఆఫర్ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.


తాజాగా ఈ హీరోయిన్ తన రెమ్యునరేషన్ ను   పెంచినట్టు ఫిల్మీ దునియా లో గుస గుసలు వినబడుతున్నాయి. ఇదివరకు ఒక సినిమాకు 50 లక్షల వరకు పారితోషకం తీసుకున్న బేబమ్మ ప్రస్తుతం మాత్రం 75 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ నీలికళ్ల సుందరి రాబోయే సినిమాలతో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: