జగదేకవీరుడు అతిలోకసుందరి
సినిమా లో బేబీ శాలిని గా మనందరి హృదయాలను కట్టిపడేసిన బాలనటి శాలిని ఆ తర్వాత
హీరోయిన్ గా సఖి చిత్రం లో చేసి ప్రేక్షకులందరినీ ఎంతో మంత్ర ముగ్ధులను చేసింది.
మాధవన్ హీరో గా శాలిని
హీరోయిన్ గా నటించిన ఈ
సినిమా అప్పట్లో యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో శాలిని నటనకు చూపించిన అందాలకు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా
ఫిదా అయిపోయాడు. దాంతో ఆమె తమిళంలో కొన్ని సినిమాలతోనే స్టార్
హీరోయిన్ కాగా మలయాళంలో ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది.
ఇక తన కెరీర్ మంచి దశలో ఉండగానే
తమిళ స్టార్
హీరో అజిత్ ను ప్రేమించి పెళ్ళాడింది. ఆ తర్వాత సినిమాలను ఎక్కువగా ఒప్పుకోకుండా కుటుంబంతోనే గడప సాగింది.
అజిత్ కి మధ్యలో కొంత అనారోగ్యం కావడం పలు సమస్యల కారణంగా ఆమె సినిమాల వైపు చూడకుండా ఉండిపోయింది. అయితే ఇప్పటివరకు ఈమె తన
లవ్ స్టోరీ ని మాత్రం ఎవరికీ చెప్పలేదు.
అజిత్ తో ఏ క్షణంలో ఆమె ప్రేమలో పడిందో ఏవిధంగా ఆయనతో
ప్రేమ లో పడిందో ఎవరికీ చెప్పలేదు. తాజాగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.
హీరోయిన్ షాలిని కి అప్పట్లో సెలబ్రిటీలలో సైతం మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆ విధంగా ఆమె క్రేజ్ ని చూసి, ఆమె అందానికి ముగ్ధుడై ఆమెపై మొదట గౌరవం పెంచుకున్నాడట అజిత్. ఆ తర్వాత ఆ గౌరవం కాస్త ప్రేమగా మారి
పెళ్లి వరకు వెళ్ళింది.
అజిత్ గారితో అమర్కలం
సినిమా చేసిన శాలిని ఆ
సినిమా చేస్తున్న సమయంలోనే వీరిద్దరు బాగా దగ్గరయ్యారట.
తెలుగులో అద్భుతం అనే పేరుతో విడుదలైంది ఈ సినిమా. ఒక రోజు షూటింగ్ లో ఏదో
లవ్ సీన్ చేయాల్సి రాగా అసలే సిగ్గు ఎక్కువ కావడంతో
అజిత్ కొంత మొహమాట పడ్డారట. ఇద్దరూ గాఢంగా హత్తుకుని పోవాలి అనడం తో వీరు ఇద్దరు ఇబ్బంది పడుతునే చేశారట. అయితే
డైరెక్టర్ కట్ చెప్పిన కూడా మాకు ఏమీ వినిపించలేదు అలాగే ఉండిపోయాం అని ఆమె వెల్లడించింది. ఇది చూసి యూనిట్ సభ్యులు అందరూ షాక్ కు గురయ్యారట.