టాలీవుడ్ లో తెలుగు వారికి తెలుగు సినిమాల్లో ఎక్కువ అవకాశాలు రావట్లేదు అన్న వాదన నెలకొంటున్న వేల ఓ
తమిళ నటుడు కి వరుస అవకాశాలు ఇస్తూ వారిలో లేని అనుమానాలను కలిగిస్తున్నారు మన దర్శక నిర్మాతలు.
కోట శ్రీనివాసరావు లాంటి పెద్ద పెద్ద దిగ్గజ నటులు తెలుగు వారికి అవకాశం ఇవ్వాలని ఓ వైపు ఎంత మొత్తుకున్నా మన హీరోలు దర్శకులు నిర్మాతలు మాత్రం పొరుగు భాష నటులకి వెళ్లడం అందరినీ ఎంతో కలచివేస్తుంది. ఈ నేపథ్యంలో తన నటనతో తన విలనిజంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న
సముద్రఖని తెలుగులో వరుస అవకాశాలు సాధిస్తున్నాడు.
దర్శకుడిగా పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత నటుడిగా మారాడు సముద్రఖని. తెలుగులో సైతం ఆయనకు ఆయన నటనకు
ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. తెలుగులో గతంలో చాలా సినిమాలు చేసినప్పటికీ ఆయనకు నటుడిగా పేరు తెచ్చిన పాత్ర మాత్రం అలా వైకుంఠపురం లో
సినిమా అని చెప్పాలి. దర్శకుడిగా తెలుగులో నాలో, శంభో
శివ శంభో, జెండాపైకపిరాజు వంటి సినిమాలను చేయగా నటుడుగా
సముద్రఖని శంభో
శివ శంభో సినిమాలో ఓ చిన్న పాత్ర చేశాడు. ఆ తర్వాత
అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం లో సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు.
ఇక
క్రాక్ సినిమాలో ఆయన పండించిన విలనిజానికి
టాలీవుడ్ లో దర్శకులు నిర్మాతలు
ఫిదా అయిపోయి ఆయనకు వరుస అవకాశాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో, ఆకాశవాణి సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకుండా పవన్
కళ్యాణ్ రానా లు హీరోలుగా నటిస్తున్న ఏకే
రీమేక్ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. తాజాగా
సముద్రఖని మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లూసిఫర్ సినిమాలో కూడా ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడు.
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ
సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.