సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్ కు మంచి ఆదరణ లభించింది. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రంతో మహేష్ బాబు, వెంకటేష్ ప్రేక్షకులకు అద్భుతమైన మల్టీస్టారర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అందించారు. దీంతో ఆ ట్రెండ్ మొదలై వెంకటేష్, పవన్ హీరోలుగా "గోపాల గోపాల", వెంకటేష్, రామ్ హీరోగా "మసాలా", వెంకటేష్, నాగచైతన్య కాంబోలో "వెంకీ మామ" వచ్చాయి. దీంతో వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. దర్శకనిర్మాతలకు మల్టీస్టారర్ నిర్మించడం అనేది కత్తి మీద సామే. అయినా కూడా ధైర్యం చేసి ప్రేక్షకులను ఇద్దరు స్టార్ హీరోలతో ఒకే సినిమాలో మంచి వినోదాన్ని అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మరో క్రేజీ మల్టీస్టారర్ కు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దగ్గుబాటి హీరోల కాంబినేషన్ లో ఈ మూవీ రూపొందనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఓ స్టార్ హీరో రివీల్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ఆ స్టార్ హీరో ఎవరు? ఎందుకు రివీల్ చేశాడు? అంటే...
 
స్టార్ హీరో, దగ్గుబాటి వారసుడు రానా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రాబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడాడు. తాను, వెంకటేష్, అభిరామ్ దగ్గుబాటి మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నామని, ఈ చిత్రం అతి త్వరలో సెట్స్ పైకి వస్తుందని రానా చెప్పారు. దీంతో ఈ ప్రాజెక్ట్ గురించి అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం దగ్గుబాటి మల్టీస్టారర్ గురించే బజ్ నడుస్తోంది. “నారప్ప" ఓటిటి లో విడుదలైనందుకు నేను కూడా నిరాశపడ్డాను. థియేటర్లలో విడుదలైతే బాగుంటుందని అనుకున్నాను అని అన్నారు. "ఆర్ఆర్ఆర్" విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ఇంకా మాట్లాడుతూ “నేను వివాహం తరువాత చాలా మారిపోయాను. పెళ్ళి తర్వాత ఎవరైనా అలాంటి మార్పులకు లోనవ్వడం సహజం. నేను ఇప్పుడు మరింత బాధ్యతగా మెలుగుతున్నాను" అంటూ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. కాగా రానా "విరాటా పర్వం" విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతుందని కొందరు చెబుతుండగా, మరికొందరు మాత్రం ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల అవుతుందని అంటున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు ? ఎక్కడ ? రిలీజ్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: