అయితే తాజాగా మళ్లీ పోర్నోగ్రఫి చేసి యాప్ల ద్వారా విడుదల చేస్తున్నాడనే ఆరోపణలతో ఆరెస్ట్ చేసిన పోలీసులు రాజ్ కుంద్రాను మంగళవారం ముంబైలోని క్రైమ్ బ్రాంచ్ యొక్క ప్రాపర్టీ సెల్ యూనిట్ కు తీసుకు వచ్చి విచారించారు.
విచారణలో పలు విషయాలు బయటకు వచ్చాయి. యూకేకు చెందిన ఓ సంస్థ కుంద్రాకు హాట్షాట్ యాప్లను విక్రయించినట్టు సమాచారం. గతంలోనే తన కంపెనీ షేర్లను అమ్మినట్లు కుంద్రా పోలీసులకు చెప్పాడు. షెర్లిన్ చోప్రాతో రాజ్ కుంద్రా సంస్థ ఆర్మ్స్ప్రైమ్ మీడియా సోర్సెస్తో ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. సోమవారం అరెస్టుకు ముందే, వ్యాపారవేత్త రాజ్ కుంద్రపై గత ఏడాది మహారాష్ట్ర పోలీస్ సైబర్ సెల్ అశ్లీల వీడియోలను తయారు చేసి, సృష్టించినందుకు కేసు నమోదు చేసింది.
ఈ క్రమంలో సోమవారం బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త అయిన కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 23 వరకు ముంబై కోర్టు రిమాండ్ కు ఆదేశించింది. మహారాష్ట్ర పోలీస్ సైబర్ సెల్ గత సంవత్సరం అనేక OTT ప్లాట్ఫారమ్లపై కేసు నమోదు చేసింది, వీటిలో రాజ్కుంద్రా భాగస్వామిగా ఉన్న హాట్షాట్లు కూడా ఉన్నాయి. ఈ ఓటీటీ సంస్థను ఆర్మ్స్ప్రైమ్ మీడియా అభివృద్ధి చేసింది. హాట్షాట్లను యుకెకు చెందిన కెన్రిన్ సంస్థ పేరుతో కుంద్రాకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసుకు సంబంధించి ఆర్మ్స్ప్రైమ్ కోసం ఒక ఫోటోగ్రాఫర్ మరియు క్రియేటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఒక మహిళను కూడా సైబర్ సెల్ అరెస్టు చేసింది. కుంద్రా ఈ ఏడాది ఆరంభంలో పోలీసులకు తన కంపెనీ వాటాలను విక్రయించాడని, తన పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు, ఎగ్జిట్ ఫార్మాలిటీలను అధికారులకు సమర్పించానని చెప్పాడు.
మహారాష్ట్ర పోలీస్ సైబర్ సెల్ వర్గాల సమాచారం ప్రకారం, 2020 లో ఈ కేసులో నటులు షెర్లిన్ చోప్రా మరియు పూనమ్ పాండేలను కూడా సహ నిందితులుగా నమోదు చేశారు. సైబర్ సెల్ ఇచ్చిన ప్రకటనలతో నటులు షెర్లిన్ చోప్రా, పూనం పాండే రాజ్ కుంద్రాపై ఆరోపణలు చేశారు.