సూపర్ స్టార్ మహేష్ తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే.. సమయం దొరికినప్పుడల్లా తన భార్య, పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటాడు. అంతేకాదు అప్పుడప్పుడు తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు టూర్లు కూడా వెళ్తుంటాడు. అయితే సోషల్ మీడియాలో మహేష్ ఫ్యామిలీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మహేష్ గారాల పట్టి సితార కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.తన క్యూట్ ఫొటోస్, డాన్స్ వీడియోలతో ఎన్నో నెటిజన్స్ ని ఆకట్టుకుంది సితార.ఇక ఆ మధ్య సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఏకంగా తన తండ్రి మహేష్ నే ఇంటర్వ్యూ చేసి సంచలనం సృష్టించింది. దీంతో సోషల్ మీడియాలో సితార పాపను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోయింది.

 ఇక తాజాగా జూలై 20 న సితార తన పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అటు అభిమానులు, ఇటు సెలెబ్రెటీలు సైతం సోషల్ మీడియా వేదికగా ఈమెకి బర్త్ డే విషెస్ ని అందించారు. ఇక ఇదిలా ఉంటె ప్రస్తుతం సితార కి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో సితార క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని మహేష్ బాబు తన కూతురితో ఒక షార్ట్ ఫిల్మ్ ని ప్లాన్ చేస్తున్నాడట.మొబైల్ ఎడిక్షన్ అనే కాన్సెప్ట్ తో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కనున్నట్లు సమాచారం.ఈ షార్ట్ ఫిల్మ్ ని సితారతో షూట్ చేయించబోతున్నట్లు చెప్తున్నారు.

ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఈ వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన పూర్తి వివరాలను స్వయంగా మహేష్ బాబే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రస్తుతం మహేష్ బాబు.. సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది.పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ని ప్లే చేస్తున్నారు. ఇక మహేష్ కి జోడిగా ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: