కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే తన 25 సంవత్సరాల సినీ జీవిత కాలంలో, దాదాపు 375 సినిమాలలో నటించడం విశేషం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, 1999వ సంవత్సరంలో అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు చిత్రంలో పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా మల్లికార్జున రావు పని చేశారు. ఈ సినిమాలో టైమింగ్ కి తగ్గ కామెడీని పండించి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు.
ఇదిలా ఉండగా, ఈయన సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేసేవారు అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతూ ఉంటుంది. ఇక ఆ విషయానికి వస్తే , అనకాపల్లిలో జన్మించిన మల్లికార్జునరావు , అక్కడే విద్యాభ్యాసం పూర్తీ చేశారు. విద్యాభ్యాసం ముగిసిన తరువాత అనకాపల్లి లో ఉన్న ఏ యం వి యం అనే ఆసుపత్రిలో ఉద్యోగం చేయడం గమనార్హం.ఇక ఆర్థికంగా తన జీవితాన్ని మొదలు పెట్టాడు మల్లికార్జున రావు.
ఇక నటన మీద ఆసక్తితో ఒకపక్క నాటకాలు వేస్తూనే, 1973 సంవత్సరంలో సిడి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక అంతే కాదు మా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అలాగే హైదరాబాదులో శ్రీనగర్ కాలనీ లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా కూడా మల్లికార్జున రావు పని చేయడం జరిగింది.