అలనాటి అందాల తార వాణిశ్రీ.. ఈమె కళ్ళల్లో రాజసం ఉట్టిపడేలా ఉండేది.. ఈమె ఏదైనా పాత్రలో నటిస్తోంది అంటే అంతే భీకరంగా.. పౌరుషం గా సాగేవి ఈమె పాత్రలన్నీ.. ఆనాటికే కాదు..ఈనాడు కూడా ఆమె సీరియల్స్ లో అడుగుపెట్టి , కూడా తన పరాక్రమాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా, అంతే ధీమాగా పాత్రలో నటిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే , అలనాటి మహానటి సావిత్రి తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే, అది కేవలం వాణిశ్రీ మాత్రమే. సినీ ఇండస్ట్రీని అప్పట్లో ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

చూడ చక్కని మోము,  అంతకంటే అందమైన ఆమె చిరునవ్వు.. చూసిన కళ్ళకు కాంతులు విరజిమ్మేలా.. ఆమె నటనతో అందర్నీ మెస్మరైజ్ చేస్తూ ఉండేది. అంతే కాదు ఎంతో మంది,  తెలుగు వారిని తనవైపు తిప్పుకున్న ఏకైక నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతటి మహా గొప్ప స్థానాన్ని చేరుకున్న వాణిశ్రీ తో నటించాలి అంటే ఎంతో మంది హీరోలు క్యూ కట్టే వారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇకపోతే ఒకానొక కాలంలో హీరోగా, కమెడియన్ గా,  క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంద్రమోహన్, మొదటి సారి హీరోగా నటించిన  చిత్రం రంగుల రాట్నం.ఈ  సినిమా కి వాణిశ్రీ హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ చిత్రాన్ని బి.ఎన్.రెడ్డి  డైరెక్ట్ చేశారు. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో మొదటి సారి హీరోగా పరిచయమైన చంద్రమోహన్, వాణిశ్రీ ని హీరోయిన్ గా పరిచయం చేయడం ఇష్టం లేదట. అంతేకాదు ఆమెను ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా పోల్చి, వెంటనే ఆమెను మార్చమని దర్శకుడికి సలహా కూడా ఇచ్చాడట చంద్రమోహన్. అయితే ఈ విషయాలన్నీ చంద్రమోహన్ తాజాగా ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలపడం గమనార్హం. ఇక ఆ తర్వాత కాలంలో ఆమె స్టార్ హీరోయిన్ గా  ఎదుగుతుంది అనిన్బి.యన్.రెడ్డి జోష్యం  కూడా చెప్పారు. ఇక ఆయన ఈ మాటలు ముందుగా చెప్పడంతో ఆమె స్థాయిని మరొకరు అందుకోలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: