గత కొన్ని సినిమాలుగా వరుస ప్లాపులు అందుకుంటూ ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న హీరో శర్వానంద్ ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతిదర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమా చేస్తున్నాడు. సిద్ధార్థ మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అతిధి రావు హైదరి, అను ఇమ్యన్యుయెల్ ఈ సినిమాలో హీరోయిన్ లు గా నటిస్తున్నారు.  నిజానికి తన మొదటి సినిమా కంటే రెండో సినిమాను చేయడానికి ఎక్కువ కష్టపడ్డాడు అజయ్ భూపతి.

ఎందుకంటే ఈ మహాసముద్రం కథను ఎంతోమంది హీరోలకు చెప్పగా వారు ఏదో ఒక కారణం వల్ల దీన్ని రిజెక్ట్ చేస్తూ వచ్చారు చివరికి ఈ సినిమాను శర్వానంద్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన ఈ సినిమా అప్డేట్లు సినిమా పై మంచి అభిప్రాయాన్ని కలుగజేస్తున్నాయి. శర్వానంద్ ఈ సినిమాతో మరొక హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నారు ఆయన అభిమానులు. ఇక మహా సముద్రం విడుదల కాకముందే శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నాడు. 


ఆడాళ్ళు మీకు జోహార్లు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాను మొదలు పెట్టేసాడు కూడా.  రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఈమె బాలీవుడ్ లో సైతం అవకాశాలు పొందుతూ అక్కడ కూడా మంచి పాపులారిటీని దక్కించుకుంటుంది. టాలీవుడ్ లోని అందరూ స్టార్ హీరోల కు ఈమె హీరోయిన్ గా కావాలి. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు శర్వానంద్ తో సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తి వ్యక్తపరుస్తున్నారు. గతంలో వీరిద్దరూ ఎప్పుడూ పనిచేయకపోవడంతో శర్వానంద్ నటనలో తనదైన స్టైల్ చుపిస్తుండడం తో ఏ విధంగా వీరి కాంబో ఉంటుందోననీ,  ఏ విధంగా కెమిస్ట్రీ పండబోతుందోనని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన పుష్ప అనే సినిమాలో నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: