గత కొన్ని సినిమాలుగా వరుస ప్లాపులు అందుకుంటూ ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న
హీరో శర్వానంద్ ప్రస్తుతం
ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న
అజయ్ భూపతిదర్శకత్వంలో మహాసముద్రం అనే
సినిమా చేస్తున్నాడు. సిద్ధార్థ మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అతిధి రావు హైదరి, అను ఇమ్యన్యుయెల్ ఈ సినిమాలో
హీరోయిన్ లు గా నటిస్తున్నారు. నిజానికి తన మొదటి
సినిమా కంటే రెండో సినిమాను చేయడానికి ఎక్కువ కష్టపడ్డాడు
అజయ్ భూపతి.
ఎందుకంటే ఈ మహాసముద్రం కథను ఎంతోమంది హీరోలకు చెప్పగా వారు ఏదో ఒక కారణం వల్ల దీన్ని రిజెక్ట్ చేస్తూ వచ్చారు చివరికి ఈ సినిమాను శర్వానంద్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన ఈ
సినిమా అప్డేట్లు
సినిమా పై మంచి అభిప్రాయాన్ని కలుగజేస్తున్నాయి. శర్వానంద్ ఈ సినిమాతో మరొక హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నారు ఆయన అభిమానులు. ఇక
మహా సముద్రం విడుదల కాకముందే శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని
సినిమా కిషోర్
తిరుమల దర్శకత్వంలో చేస్తున్నాడు.
ఆడాళ్ళు మీకు జోహార్లు అనే టైటిల్ తో ఈ
సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాను మొదలు పెట్టేసాడు కూడా. రష్మిక మందన
హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం
టాలీవుడ్ నెంబర్ వన్
హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఈమె
బాలీవుడ్ లో సైతం అవకాశాలు పొందుతూ అక్కడ కూడా మంచి పాపులారిటీని దక్కించుకుంటుంది.
టాలీవుడ్ లోని అందరూ స్టార్ హీరోల కు ఈమె
హీరోయిన్ గా కావాలి. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు శర్వానంద్ తో
సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తి వ్యక్తపరుస్తున్నారు. గతంలో వీరిద్దరూ ఎప్పుడూ పనిచేయకపోవడంతో శర్వానంద్ నటనలో తనదైన స్టైల్ చుపిస్తుండడం తో ఏ విధంగా వీరి కాంబో ఉంటుందోననీ, ఏ విధంగా కెమిస్ట్రీ పండబోతుందోనని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం
రష్మిక అల్లు
అర్జున్ సరసన పుష్ప అనే సినిమాలో నటిస్తుంది.