మెగా పవర్ స్టార్ రాం చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఆర్సీ 15 సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్న విషయంపై క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో మొన్నటి దాకా బాలీవుడ్ భామలు కియరా అద్వాని, అలియా భట్ లలో ఒకరు హీరోయిన్ గా నటిస్తారని వార్తలు వచ్చాయి. ఆర్సీ 15 సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మికని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.

టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఎవరంటే అందరు రష్మిక పేరే చెబుతారు. తెలుగులో ఆమె నటిస్తున్న సినిమాలన్ని సక్సెస్ అవుతుండటంతో అమ్మడికి వరుస క్రేజీ ఛాన్సులు వస్తున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సెన్సేషనల్ మూవీ పుష్పలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. పుష్పతో పాన్ ఇండియా ఛాన్స్ దక్కించుకున్న అమ్మడు ఇప్పుడు శంకర్, రాం చరణ్ సినిమాలో కూడా లక్కీ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా కూడా నేషనల్ లెవల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

వరుస పాన్ ఇండియా సినిమాలతో కెరియర్ సూపర్ ఫాం లో కొనసాగిస్తున్న రష్మిక రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని తెలుస్తుంది. ఓ పక్క పూజా హెగ్దే సినిమాకు 3 కోట్లు డిమాండ్ చేస్తుంటే ఆమెకు ఏమాత్రం తీసిపోని రష్మిక ప్రస్తుతం సినిమాకు రెండున్నర కోట్లు ఇస్తేనే అంటూ చెబుతుందట. ఆర్సీ 15 సినిమాకు అమ్మడు అడిగినంత ఇచ్చి రష్మికని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. ఇదే కాదు ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమాకు కూడా రష్మిక డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుంది. ఈ సినిమాలతో రష్మిక మరోసారి తన టాలెంట్ చూపిస్తుందని అంటున్నారు. బాలీవుడ్ భామలకు ధీటుగా సౌత్ హీరోయిన్స్ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా వరుస పాన్ ఇండియా సినిమాల్లో వారి టాలెంట్ తో మెప్పిస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: