రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా ఎఫెక్ట్ వల్ల సినిమా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం పరిస్థితులు అన్ని చక్కబడుతున్నా కూడా ఇంకా సినిమా రిలీజ్ ల విషయంలో దర్శకనిర్మాతలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధంగా ఉన్న కొన్ని పలు మీడియం బడ్జెట్ సినిమాలు వరుసగా ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి.ఒకవేళ నిర్మాతలు ధైర్యం చేసి థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేసినా..అసలు జనాలు థియేటర్లకి వస్తారన్న గ్యారెంటీ లేదు. అందుకే  అగ్ర హీరోల సినిమాలు సైతం ఇప్పుడు ఓటీటీ బాట పడుతున్నాయి.

ఇందులో భాగంగానే నిన్న (అనగా జులై 20) వెంకటేష్ హీరోగా నటించిన 'నారప్ప' సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన విషయం తెలిసిందే.ఇప్పుడు మరో అగ్ర హీరో సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.శివ నిర్వాణ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'టక్ జగదీష్'.షైన్ స్క్రీన్ ప్రొడక్షన్ పై సాహు గారుపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించారు.అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 23 న విడుదల చేయాలని భావించారు.

కానీ అప్పటికే కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో విడుదల వాయిదా వేశారు.ఇక ఇప్పటికే ఈ సినిమా ఆలస్యం కావడంతో ఓటిటిలో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు నిర్మాతలు.ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసినట్లు క్లారిటీ ఇచ్చారు మేకర్స్.ఇక అతి త్వరలోనే టక్ జగదీష్ సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకుల్లో విశేష స్పందనను రాబట్టయి.మరి విడుదల తర్వాత ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: