యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ వ‌రుస పెట్టి సినిమాల‌ను ప‌ట్టాలెక్కిం చేస్తున్నారు. ఆయ‌న త‌న తాజా ఇంట‌ర్వ్యూలో కూడా వ‌రుస‌గా ఐదారు సినిమాలు లైన్లో ఉన్నాయ‌ని చెప్పారు. ఈ సినిమాల‌కు ద‌ర్శ‌కులు కూడా ఖ‌రార‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు కంప్లీట్ అయ్యింది. ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న ప్ర‌గ్య జైశ్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య క్రాక్ సినిమా ద‌ర్శ‌కుడు మలినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే కంప్లీట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌లో చేయ‌నున్నారు. ఈ సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడి - బాల‌య్య కాంబోలో ఓ సినిమా రానుంది.

సినిమా దిల్ రాజు బ్యాన‌ర్లోనే వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువుగా ఉన్నాయి. బాల‌య్య తో ఎప్ప‌టి నుంచో ఓ సినిమా చేయాల‌ని దిల్ రాజు అనుకుంటున్నాడు. అదే స‌మ‌యంలో అనిల్ రావిపూడి డేట్స్ కూడా దిల్ రాజు ద‌గ్గ‌ర ఉన్నాయంటున్నారు. ఈ రెండు సినిమాల త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ కు బాల‌య్య ఓ సినిమా క‌మిట్ అయ్యాడు. అయితే మ‌లినేని గోపీచంద్ సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడి సినిమా చేసి పూరితో చేస్తాడా ?  లేదా ? అంత‌కంటే ముందే పూరి - బాల‌య్య సినిమా అయిపోతుందా ?  అన్న‌ది చెప్ప‌లేం. పూరి ఏ సినిమాను అయినా మూడు నెలల్లో లాగించేస్తాడు.

ఈ మూడు సినిమాల త‌ర్వాత క్రిష్ బాల‌య్య‌కు ఓ ప‌వ‌ర్ ఫుల్ హిట్ ఇవ్వాల‌ని క‌సితో ఉన్నాడు. ఈ ప్రాజెక్టు కూడా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంద‌ని అంటున్నారు. శాత‌క‌ర్ణి స్టైల్లో చారిత్ర‌క క‌థాంశంతో నే ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ న‌లుగురు డైరెక్ట‌ర్ల తో పాటు బాల‌య్య - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో సినిమా పై చ‌ర్చ‌లు అయితే స్టార్ట్ అయ్యాయి. అయితే ఇది ఎంత వ‌ర‌కు ఉంటుంద‌న్న‌ది మాత్రం అప్పుడే చెప్ప‌లేం ?


మరింత సమాచారం తెలుసుకోండి: