'ఉప్పెన' సక్సెస్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది కృతి శెట్టి. ఈ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ కోసం హీరోలంతా క్యూ కడుతున్నారు. టాలీవుడ్ లో ఈ చిన్నదాని జోరు మామూలుగా లేదు. ఇప్పటికే ముగ్గురు హీరోలతో జోడి కడుతున్న బేబమ్మ మరో హీరోను కూడా పడేసింది. తాజా బజ్ ప్రకారం మరో టాలీవుడ్ యంగ్ హీరో తో రొమాన్స్ చేయడానికి కృతి రెడీ అవుతోంది. ఈ ఏడాది "రంగ్ దే, చెక్" సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ లో కృతి కనిపించనుంది. ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ ఈ చిత్రంతో డైరెక్టర్ గా మారడానికి సిద్ధం అవుతున్నారు. కొన్ని నెలల క్రితమే ఈ చిత్రానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన హోం బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటించబోతుందని సమాచారం. ఈ మూవీలో నటించడానికి యంగ్ బ్యూటీ భారీగా వసూలు చేస్తోందట. ఇప్పటికే ఆమె రెమ్యూనరేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. 

ఇక ఈ చిత్రంతో పాటు కృతి ఖాతాలో ప్రస్తుతం మరో మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో నానితో కలిసి "శ్యామ్ సింగ రాయ్", సుధీర్ బాబు తో కలిసి "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి", ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి "రాపో19" సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ మూవీలు అన్నీ కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇక "బంగార్రాజు"లో కూడా కృతి శెట్టి కీలక పాత్ర పోషిస్తుందని ప్రచారం జరుగుతోంది. కృతి శెట్టి నటిస్తున్న సినిమాలన్నీ కూడా హిట్ అయితే ఇండస్ట్రీ ఆమెపై 'గోల్డెన్ లెగ్' ముద్ర వేసి స్టార్ హీరోయిన్ ను చేయడం ఖాయం. బేబమ్మ అభిమానులకు త్వరలోనే వరుస సినిమాల్లో ఆమెను వెండి తెరపై వీక్షించే అవకాశం దొరుకుతుంది. మరోవైపు వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయడానికి నితిన్ సంతకం చేశాడు. ఈ సినిమా మా షూటింగ్ ఈ ఏడాది ప్రారంభం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: