టాలీవుడ్ లో నటిగా ఎన్నో సినిమాలలో నటించి గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది అన్నపూర్ణమ్మ. సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె ప్రతి ఒక్క ప్రేక్షకుడికి సుపరిచితమే. సినిమాల్లో మాత్రమే కాకుండా కొన్ని బుల్లితెర షో లలో కూడా కనిపిస్తూ ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మెగాస్టార్ చిరంజీవి ఓరోజు తనపై అరిచాడు అని చెప్పి ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఎప్పుడు కామ్ గా కూల్ గా ఉండే మెగాస్టార్ చిరంజీవి అలా చేయడం ఏంటి దాని వెనుక ఉన్న కారణం ఏమిటి అని ఆమె చేసిన ఇంటర్వ్యూ కోసం వెతుకుతున్నారు.

ఈ ఇంటర్వ్యూ లో పలువురు సీనియర్ స్టార్ హీరోలు మరియు జూనియర్ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈమె. తన కెరీర్ ఎంతో బాగా కొనసాగిందని ప్రతి ఒక్కరూ తనకు ఎంతో సపోర్ట్ గా నిలిచి తాను ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం అయ్యారని చెప్పింది. చాలామందిని నేను వరుసలు పెట్టి పిలిచేదాన్ని అని చెప్పింది. రామ చిత్రం కారణంగానే తిరుపతి సినిమాల్లో అవకాశాలు వచ్చాయని చిరంజీవి మరి బాలకృష్ణ సినిమాలో కలిసి నటించే అవకాశం దక్కింది అని చెప్పారు చిరంజీవి తో ఒక సినిమా చేస్తున్న సమయంలో షూటింగ్ లో ఆయన అరిచారు అంటూ పేర్కొంది.

కొన్ని సార్లు షూటింగ్ సమయంలో డైలాగులు గుర్తు పెట్టుకుంటూ యాక్షన్ కి సిద్ధమయ్యే కంగారులో ఉంటాం. ఆ విధంగా చిరంజీవితో ఓసారి షూటింగ్ లో ఉన్న సమయంలో చిరంజీవి అరిచాడు.  నువ్వు చూసుకోవా నీపై లైట్ లేదు అన్నాడు. నేను ఆ సమయంలో నీడలో నిలబడి ఉన్నాను. చీకటిగా కనిపించడంతో ఆయన నా మంచి కోరే అలా అన్నాడు. నువ్వు ఉన్నావు కదా అందుకే అలా పక్కకు ఉన్నాను అన్నట్లుగా చెప్పగా నేను ఉన్నాను అయితే లైట్ లేకుండా ఎలా అని ఆయన అన్నాడు.  ఆ విధంగా చిరంజీవి తో తన జ్ఞాపకాలను పంచుకున్నారు అన్నపూర్ణ. 60 ఏళ్ల వయసు పైబడిన అన్నపూర్ణమ్మ ఇప్పటికీ సినిమాలు చేస్తూ కుర్ర క్యారెక్టర్ ఆర్టిస్టుల కు పోటీగా నిలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: