టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్న విషయం తెలిసిందే.'ఆట నాది గెలుపు మీది' అంటూ ఈసారి ఓ సరికొత్త కార్యక్రమంతో వస్తున్నాడు ఎన్టీఆర్.బుల్లితెర ప్రముఖ ఛానెల్ జెమినీ టీవీ నిర్వహించే 'ఎవరు మీలో కోటీశ్వరులు'అనే షోకి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.ఇక ఇప్పటికే గతంలో స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ మొదటి సీజన్ కి ఎన్టీఆర్ తన హోస్టింగ్ తో ఆ షో ని నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాడు.గతంలో ఆ షోకి భారీ రేటింగ్స్ వచ్చాయి. మళ్ళీ చాలా కాలం తర్వాత ఈసారి సరికొత్త షోతో రాబోతున్నాడు యంగ్ టైగర్.

ఇక ఇటీవలే ఈ షోకి సంబంధించిన షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఎన్టీఆర్.దాదాపు వారం రోజుల పాటు ఈ షూటింగ్ లో పాల్గొని..జూలై 20 నుంచి తిరిగి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.ఈ నేపథ్యంలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ఎప్పుడు స్టార్ట్ కానుందనే విషయంలో ఆడియన్స్ లో సర్వత్రా ఆసక్తిగా మారింది.ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. రీసెంట్ గా ఎన్టీఆర్ ఈ షో కర్టెన్ రైజర్ ఎపిసోడ్ ని పూర్తి చేశాడు.ఈ ఎపిసోడ్ లోనే రామ్ చరణ్ మొదటి గెస్ట్ గా రాబోతున్నాడు.ఇక ఈ ఎపిసోడ్ ని ఆగస్టు 15 నజెమినీ టీవీలో టెలికాస్ట్ చేయనున్నారు.అంతేకాదు ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ క్విజ్ లో పాల్గొంటారు.

అందులో గెలిచిన డబ్బుని ఛారిటీకి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ ఎపిసోడ్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడమే కాకుండా.. ఈ షో వైపుకి దృష్టి పడేలా చేస్తుందని నమ్ముతున్నారు నిర్వాహకులు.అంతేకాదు జెమినీ టీవీ వాళ్ళు ఈ షో టెలికాస్ట్ డేట్ ని భారీ పబ్లిసిటీతో అనౌన్స్ చేయబోతున్నారట.దీంతో ఈ ఎపిసోడ్ కోసం మెగా, నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు..ఇక ప్రస్తుతం ఈ ఇద్దరూ మొదటి సారి కలసి నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ ఆర్ ఆర్ దసరా కానుకగా అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది భాషలకు పైగా విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: