టాలీవుడ్ లో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హవా నడుస్తుందని చెప్పొచ్చు. స్టార్ సినిమా అంటే ముందు అమ్మడిని అడిగిన తర్వాతే మిగతా వారికి ఛాన్సులు వస్తున్నాయని తెలుస్తుంది. ప్రభాస్ రాధే శ్యాం తో పాటుగా అఖిల్ బ్యాచిలర్ సినిమాలో నటించిన పూజా హెగ్దే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో బీస్ట్ సినిమా చేస్తుంది. ఈ సినిమా కోసం పూజా హెగ్దేకి దాదాపు 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

ఇదిలాఉంటే పూజా హెగ్దేకి మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరిసినిమా చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దేని తీసుకునే అవకాశాలు ఉన్నాయట. ఆల్రెడీ పూజా హెగ్దేకి డైరక్టర్ వెంకీ అట్లూరి కథ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ఓ సినిమా కన్ఫర్మ్ చేశాడు. దీనితో పాటుగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా ఉంటుందని టాక్.

కోలీవుడ్ లో విజయ్ సినిమాతో ఏడేల్ల గ్యాప్ తో ఎంట్రీ ఇస్తున్న పూజా హెగ్దే వెంటనే ధనుష్ సినిమా ఛాన్స్ కూడా అందుకుందని తెలుస్తుంది. తెలుగులో టాప్ హీరోయిన్ గా సూపర్ ఫాం కొనసాగిస్తున్న పూజా హెగ్దే ఇదే ఫాం ను కోలీవుడ్ లో కూడా కొనసాగించే అవకాశం ఉందని చెప్పొచ్చు. వెంకీ అట్లూరి ధనుష్ కాంబో సినిమా గురించి పూర్తి డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.  తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలతో డైరక్టర్ గా తన సత్తా చాటిన వెంకీ అట్లూరి ధనుష్ తో ఎలాంటి సినిమా చేస్తాడో అని ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ఈ సినిమాలో పూజా హెగ్దేని తీసుకోవడం కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: