సోట్ట బుగ్గల సుందరి తాప్సీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన మంచు మనోజ్ హీరోగా నటించిన 'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో ఈ అమ్మడు అందచందాలకు నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ ముద్దుగుమ్మ తెలుగులో చాలా సినిమాలే చేసినా ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ , హర్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన 'ఆనందోబ్రహ్మ' ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.


 తెలుగులో సినిమాలు చేసుకుంటున్న సమయంలోనే ఈ పొట్ట బుగ్గల సుందరి బాలీవుడ్ వైపు అడుగులు వేసింది హిందీలో 'చస్మే బద్దూర్' అనే సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ హీరోయిన్ కి బాలీవుడ్లో వరుస ఆఫర్లు వచ్చాయి. ఎక్కువగా లేడీస్ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఇష్టపడే ఈ ముద్దుగుమ్మ అందులో భాగంగా తపడ్ , పింక్ , హసీనా దిల్రుబా’ వంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇలా కెరీర్ మంచి జోష్ మీద ఉన్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ  'ఔట్‌సైడర్స్ ఫిలిమ్స్‌' అనే ఒక నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. ఇకపై ఈ సంస్థ పేరు మీదగా సినిమాలు నిర్మిస్తానని , నా బాధ్యత మరింత పెరిగిందని ఈ మధ్య కాలంలోనే తెలియజేసింది.


 ప్రస్తుతం హీరోయిన్ బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ 'మిషన్ ఇంపాజిబుల్' అనే సినిమాలో నటిస్తోంది . ఈ సినిమాను 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను 'మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్' బ్యానర్ పై అశ్విన్ రెడ్డి , నిరంజన్ రెడ్డి లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తాప్సి ఇప్పటివరకు చేయని జర్నలిస్ట్ పాత్రలో నటిస్తోంది అని ఫిల్మీ దునియా లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపక్ యారగర సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: