తెలుగు ప్రేక్షకుల అభిమాన డార్లింగ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న త్రిపాత్రభినయం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత కరోనా పరిస్థితులలో టాప్ హీరోలు అంతా ఒక సినిమాను పూర్తి చేయడానికి తెగ ఇబ్బందులు పడుతూ ఉంటె టాప్ హీరోల తీరుకు భిన్నంగా ప్రభాస్ ఒకేసారి 3 సినిమాలు చేస్తూ అందరికి షాక్  ఇస్తున్నాడు.



‘రాధే శ్యామ్’ సినిమాను క్లైమాక్స్ ప్రభాస్ అదే సమయంలో ఆదిపురుష్ సలార్ సినిమాలకు కూడ కాల్షీట్లు ఇస్తున్నాడు. ‘రాధే శ్యామ్’ సినిమా కోసం ఈ మధ్యనే మరోసారి ఇటలీ వెళ్ళిన ప్రభాస్ అక్కడ మూవీకి సంబంధించి చిన్న షెడ్యూల్ పూర్తిచేసి నిన్న భాగ్యనగరం తిరిగి వచ్చాడు. మళ్ళీ రేపటి నుంచి ఈ మూవీకి సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో మరోచిన్న షెడ్యూల్  చేస్తాడని తెలుస్తోంది.



ఈ పరిస్థితి ఇలా ఉంటె ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ ప్రారంభం అయి 50 రోజులు పూర్తయిన సందర్భంగా సెట్స్ లో యూనిట్ సంబరాలు చేసుకున్నారు. ‘ఆదిపురుష్’ అనే టైటిల్ తో తయారుచేసిన ప్రత్యేకమైన కేక్ ను కట్ చేసిన ఫోటోలు మీడియాకు వైరల్ గా మారాయి. ‘రాదే శ్యామ్’ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ప్రభాస్ 10 రోజులు ‘ఆదిపురుష్’ షూట్ లో బిజీ అవుతాడు అని తెలుస్తోంది. ఆ షూట్ పూర్తి అయిన వెంటనే ఆగష్టు రెండవ వారం నుండి ‘సలార్’ సినిమా వైపు వెళ్ళి పోతాడట.


ఇలా మినిమం గ్యాప్స్ లో మూడు భారీ సినిమాలకు ప్రభాస్ సర్దుబాటు చేస్తున్న కాల్షీట్లు వ్యహారం చూసుకుంటూ ఇండస్ట్రీ వర్గాలు ‘ఆశ్చర్య’ పోవడమే కాకుండా ప్రభాస్ మారిపోయాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. ఈ మూడు సినిమాలు ప్రభాస్ ఊహించిన విధంగా విజయం సాధిస్తే  ప్రభాస్ ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ఖాయం ఆవడమే కాకుండా తనకు లభించిన నేషనల్ సెలెబ్రెటీ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: