ఇక అల్లు అర్జున్ కూడా రామ్ చరణ్ బాటలోనే నడుస్తున్నాడు. అప్పట్లో లింగుసామి దర్శకత్వంలో బైలింగ్వల్ మూవీ కూడా ప్రకటించేశాడు. అయితే ఎందుకో ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు బన్ని, మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడనే ప్రచారం ఊపందుకుంది. ఇక 'పుష్ప' సినిమా బహుభఆషా చిత్రంగా వస్తోంది.
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ కోలీవుడ్పై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకే తమిళ హిట్ సినిమా 'తడమ్'ని 'రెడ్'గా రీమేక్ చేశాడు. ఇక ఇప్పుడు తమిళ డైరెక్టర్ లింగుసామితో ఒక బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండటం విశేషం.
ఇక తమిళ హీరోల విషయానికొస్తే.. సూర్య.. తెలుగులో సినిమా చేయాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. 'గజిని, 'సింగం' సీరీస్తో వచ్చిన పాపులారిటీని పెంచుకోవడానికి స్ట్రయిట్ తెలుగు మూవీస్ చేయాలనుకుంటున్నాడు. ఇక బోయపాటి శ్రీను ఆల్రెడీ, సూర్యకి స్టోరీ నెరేట్ చేశాడనే టాక్ కూడా వస్తోంది. వీళ్లిద్దరి కాంబోలో ఒక మల్టీలింగ్వల్ వస్తుందని టాక్ వస్తోంది.
విజయ్ కోలీవుడ్లో టాప్ హీరో. దాదాపుగా 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే స్టేజ్లో ఉన్నాడు. 'విజిల్, మాస్టర్' సినిమాలతో తెలుగులో కొంచెం ఫాలోయింగ్ వచ్చింది. ఈ స్టార్డమ్ని మరింత పెంచుకోవడానికి వంశీ పైడిపల్లితో బైలింగ్వల్ చేస్తున్న విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.