టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉన్నా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టే హీరో లలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముందు వరుసలో ఉంటారు. సినిమాలలో అయినా బయట అయినా.. ఆయన మనసులో ఏముందో అదే ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటారు ఆయ‌న‌. ఈ విషయంలో ఆయన ఎంతో మందికి శత్రువు అయ్యారు.  అయినా మోహ‌న్ బాబు మనస్తత్వం మాత్రం ఎప్పటికీ మారదు. లోపల ఒకటి ఉంచుకొని... బయట మరొకటి మాట్లాడే మనస్తత్వం మోహన్ బాబుది కాదని ఆయన గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు గతంలో ఒక షోలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాఘవేంద్రరావు విపరీతమైన అహంకారి అని... ఆయనకు వరుసగా హిట్లు రావడంతో ఆయన అహంకారంతో ఉండేవారు అని మోహన్ బాబు చెప్పారు.

ఎన్టీఆర్ సింహబలుడు సినిమాలు విలన్ గా నటించిన మోహన్ బాబు షూటింగ్‌లో ఒక ఫైట్‌ సన్నివేశంలో నటించాల్సి వచ్చిందట. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు. ఆ సమయంలో మోహన్ బాబు తల‌కు చిన్న గాయం కావడంతో తల నొప్పి తో.. పాటు కన్ను వాచి పోయిందట. ఆ సమయంలో మోహన్ బాబు తన తలపై ఉన్న కిరీటం ని తీసి నేలకేసి కొట్టి అసహనం వ్యక్తం చేస్తూ షూటింగ్ నుంచి వెళ్లి పోయారట. ఆ రోజు సాయంత్రం రాఘవేంద్రరావు కబురు చేయడంతో ఆయన దగ్గరికి వెళ్ళిన‌ మోహన్ బాబుకు క్లాస్‌ పడిందట.

ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న నటుడువి.. ఇంత అహంకారం పని చేయదు అని రాఘవేంద్ర రావు వార్నింగ్‌ ఇవ్వడంతో మోహన్ బాబు సైలెంట్ గా వెనక్కి వచ్చేశారు అట. అయితే అప్పట్లో రాఘవేంద్రరావుకు వరుసగా హిట్లు రావడంతో ఆయన అహంకారంతో ఉండేవారని... రాఘవేంద్రరావు పాల్గొన్న ఓ షోలో ఆయన ముందే నాటి సన్నివేశాన్ని మోహన్ బాబు గుర్తుచేసుకున్నారు. ఈ సినిమాకు మరో స్టార్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: