అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాటి 'అందాల రాక్షసి' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది . మొదటి సినిమాలోనే ఈ హీరోయిన్ అమాయకత్వపు నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత తెలుగులో వరుస పెట్టి చాలా సినిమాల్లో నటించింది. వీటిలో పరుశురామ్ దర్శకత్వంలో లో అల్లు శిరీష్ హీరోగా నటించిన 'శ్రీరస్తు శుభమస్తు' నాగార్జున తో నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాలు ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి .


ఇప్పటికే ఈ సంవత్సరంలో  'ఏ వన్ ఎక్స్ ప్రెస్' 'చావు కబురు చల్లగా' సినిమాల్లో నటించింది . సినిమా నటీనటులు అంటే షూటింగ్ ల కోసం అనేక ప్రదేశాలు తిరగవలసి వస్తుంది . వారు త్వరగా అనుకున్న ప్రదేశాలు చేరడం కోసం విమానయాన సంస్థల పై ఎక్కువగా ఆధారపడుతుంటారు . కానీ ఈ ప్రయాణాలు కొన్నిసార్లు సాంకేతిక లోపాలవల్ల మరియు ఇతర కారణాల వల్ల రద్దు అవుతుంటాయి . లావణ్య త్రిపాఠి కూడా అలాంటి ఒక సంఘటన గురించి చెప్పు కచ్చింది. ఈ హీరోయిన్ ప్రయాణం చేయవలసిన విమానం క్యాన్సల్ అయింది దానితో ఈ ముద్దుగుమ్మకు తీవ్రమైన ఆగ్రహం వచ్చింది . ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఏషియన్ ట్యాగ్ చేసిన ఈ హీరోయిన్ .


 విమానం క్యాన్సిల్ అయిన విషయాన్ని ముందుగా ఎందుకు తెలియజేయలేదు అంటూ ప్రశ్నించింది . ఇంకో విమానంలో  సీటు బుక్ చేసుకున్న తర్వాత తనకు మెసేజ్ రావడం ఏంటని తీవ్రంగా మండిపడింది . ఇలాంటి సంఘటన ఇది వరకు ఎవరికైనా జరిగిందా లేక నాకే మొదటి సారి అని అభిమానులను ఈ ముద్దుగుమ్మ అడిగింది . దీనిపై విమానయాన  సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి . ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'రాయబారి' అనే సినిమాలో నటిస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: