నందమూరి నట వారసుడు బాలకృష్ణ వరుస చిత్రాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద కుర్ర హీరోలకు పోటీగా నిలిచి తన పవర్ చూపిస్తున్నారు. ప్రస్తుతం సీనియర్ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో సింహ , లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రాగా ఇపుడు మళ్లీ మూడోసారి మనముందుకు రాబోతున్నారు. దాంతో అభిమానుల్లో వీరి కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా..బాలయ్య తన తదుపరి ప్రాజెక్ట్ ల గురించి వెల్లడించారు. మలినేని గోపీచంద్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతోందని అధికారికంగా వెల్లడించారు.

ఇటీవలే రవితేజ హీరోగా క్రాక్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించి హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు మలినేని గోపీచంద్. దాంతో ఈ సినిమా పై కూడా అభిమానులు ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కథ ఏంటి, హీరోయిన్ ఎవరు అన్న అంశాలు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. ఇక మరో వైపు అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా కమిట్ అయ్యారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి ఇలా వుండగానే ఇపుడు నందమూరి బాలకృష్ణ , టాలెంటెడ్ దర్శకుడు వెంకీ కుడుమల కాంబినేషన్లో ఓ సినిమా ఫిక్స్ అయింది అంటూ ప్రచారం మొదలయ్యింది. ఛలో సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమైన వెంకీ కుడుముల మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత నితిన్ తో భీష్మ సినిమాను తెరకెక్కించి విజయం అందుకొన్నాడు.  అయితే ఇపుడు బాలయ్య కోసం స్ట్రాంగ్ ఎలిమెంట్స్ తో ఓ పవర్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ కాన్సెప్ట్ ను సిద్ధం చేశారని అది బాలయ్య దృష్టికి తీసుకెళ్లారు అని సమాచారం. కథ బాగా నచ్చడంతో స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బాలయ్య. అయితే ప్రస్తుతానికి ఫుల్ బిజీగా ఉండడంతో కాస్త ఫ్రీ అయ్యాక ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పినట్లు సమాచారం. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: