ఇటీవలే రవితేజ హీరోగా క్రాక్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించి హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు మలినేని గోపీచంద్. దాంతో ఈ సినిమా పై కూడా అభిమానులు ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కథ ఏంటి, హీరోయిన్ ఎవరు అన్న అంశాలు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. ఇక మరో వైపు అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా కమిట్ అయ్యారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి ఇలా వుండగానే ఇపుడు నందమూరి బాలకృష్ణ , టాలెంటెడ్ దర్శకుడు వెంకీ కుడుమల కాంబినేషన్లో ఓ సినిమా ఫిక్స్ అయింది అంటూ ప్రచారం మొదలయ్యింది. ఛలో సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమైన వెంకీ కుడుముల మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత నితిన్ తో భీష్మ సినిమాను తెరకెక్కించి విజయం అందుకొన్నాడు. అయితే ఇపుడు బాలయ్య కోసం స్ట్రాంగ్ ఎలిమెంట్స్ తో ఓ పవర్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ కాన్సెప్ట్ ను సిద్ధం చేశారని అది బాలయ్య దృష్టికి తీసుకెళ్లారు అని సమాచారం. కథ బాగా నచ్చడంతో స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బాలయ్య. అయితే ప్రస్తుతానికి ఫుల్ బిజీగా ఉండడంతో కాస్త ఫ్రీ అయ్యాక ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పినట్లు సమాచారం. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు మరి.