ఇక శ్రీలక్ష్మి లేడీ కమెడియన్గా జంధ్యాల సినిమాల్లో రాణించి, అలా వచ్చిన పేరుతో అనేక అవకాశాలు సంపాదించుకొని ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అయితే వాస్తవానికి శ్రీలక్ష్మి సినిమాల్లో నటించడం రాజేశ్కు ఏమాత్రం ఇష్టం ఉండేదికాదంట. శ్రీలక్ష్మిని నటించవద్దని ఆయన చెప్పినా, శ్రీలక్ష్మి వినిపించుకోలేదంట. ఇక అందరూ పనిచేస్తేనే కుటుంబం గడుస్తుందనీ, తను నటిస్తాననీ తేల్చిచెప్పి నటిగా రాణించారు.
అయితే శ్రీలక్ష్మి వాళ్ళ తండ్రి తొలి తరం సినీ కథానాయకుడు అమర్నాథ్. ఆయన చనిపోయినప్పుడు వాళ్ల కుటుంబం హైదరాబాద్లోనే నివాసం ఉండేది. ఇక ఆయన చనిపోయాక జీవనాధారం కోసం ఆ కుటుంబం మద్రాస్ వెళ్లింది. కాగా.. అమరనాథ్కు, భానుచందర్ వాళ్ల నాన్న మాస్టర్ వేణు మంచి స్నేహితులు. దాంతో వారి కుటుంబం నేరుగా ఇంటికే వెళ్లారు శ్రీలక్ష్మి వాళ్లు. ఇక ఆ ఇంట్లోనే ఓ పోర్షన్లో అద్దెకు నివాసం ఉండేవారు. ఇక రాజేష్ కి జంధ్యాల సినిమా 'నెలవంక'లో హీరోగా సినిమా అవకాశం వచ్చింది.
ఆ తరువాత రెండు జెళ్ల సీత' సినిమాలోని నలుగురు హీరోల్లో ఒకడిగా రాజేశ్ను జంధ్యాల తీసుకున్నారు. ఈ చిత్రంలో సుత్తి వేలు భార్యగా ఓ చిన్న వేషానికి శ్రీలక్ష్మిని తీసుకున్నారంట. కాగా.. అమౌనంగానే ఉన్నారు. క్క నటిగా మారడం ఎందుకనో రాజేశ్కు నచ్చలేదు. ఇక మొదట మౌనంగానే ఉన్నారు ఆయన. ఈ చిత్రంలో శ్రీలక్ష్మిని రెండు రోజుల క్యారెక్టర్ కోసమే తీసుకున్నారు. అయితే.. సుత్తి వేలు, ఆమె మధ్య సన్నివేశాలు బాగా వస్తూ, విపరీతమైన హాస్యాన్ని కురిపిస్తున్నాయన్న విషయం సెట్స్లోనే అర్థమవడంతో జంధ్యాల ఆమె పాత్రను పెంచారంట.
ఇక అప్పుడు రాజేశ్, "నువ్వెందుకు ఈ క్యారెక్టర్కు వచ్చావ్? నేను హీరోగా చేస్తున్నాను కూడా అన్నారంట. అంతేకాక.. నువ్వు రెండు రోజుల వేషానికి వచ్చావ్.. నువ్వు వెళ్లిపో" అని చెప్పారంట. దానికి ఆమె అదేంట్రా.. నలుగురూ కష్టపడితేనే కదా మన కుటుంబం మంచిగా ఉండేది అని ఆమె చెప్పుకొచ్చారు.