‘నారప్ప’ మూవీలో వెంకటేష్ నట ప్రతిభకు విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. మెగా స్టార్ చిరంజీవి నుండి సమంత వరకు అందరు వెంకటేష్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీకి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల గురించి పెద్దగా ఎవరు మాట్లాడకపోయినా ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా వెంకటేష్ గురించి మాట్లాడుకుంటోంది.


ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా వెంకటేష్ తీసుకున్న ఒక నిర్ణయం ఇండస్ట్రీ వర్గాలను ముఖ్యంగా దిల్ రాజ్ ను ఆశ్చర్య పరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ అదుపులోకి రావడంతో షూటింగ్ లు మొదలైన పరిస్థితులలో ‘ఎఫ్ 3’ మూవీ షూటింగ్ ను ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ మూవీని ఈ సంవత్సరం క్రిస్మస్ సీజన్ లో విడుదల చేయాలని దిల్ రాజ్ భావించాడు.


అయితే త్వరలో మరో షెడ్యూల్ ను మొదలు పెట్టవలసి ఉన్న ‘ఎఫ్ 3’ షూటింగ్ ను రెండు నెలలు పాటు వాయిదా వేయమని దిల్ రాజ్ కు వెంకటేష్ చెప్పాడు అని వార్తలు గుప్పు మంటున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళుతున్నానని అందువల్ల తాను మూవీ షూటింగ్ కు అందుబాటులో ఉండనని వెంకటేష్ దిల్ రాజ్ కు చెప్పినట్లు టాక్.


ప్రతి ఏడాది తన కుటుంబ సభ్యులతో వెకేషన్ కు వెళ్ళడం వెంకటేష్ కు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. అయితే గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ పరిస్థితులు వల్ల వెంకటేష్ తన వెకేషన్ ను వాయిదా వేసుకుంటూ వచ్చాడు. దీనితో మార్పు కోసం వెంకీ వెళుతున్నాడని చాలామంది భావిస్తున్నారు. అయితే ఈ ట్రిప్ ఏకంగా రెండు నెలలు ఉండటంతో వెంకీ తీసుకుంటున్న ఈ గ్యాప్ వెనుక మరేదైనా బయటకు చెప్పని కారణం ఉందా అంటూ అనేక రకాలుగా మరికొందరు అభిప్రాయ పడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: